భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...జీశాట్-30 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి అరియాన్-5 వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లినట్లు ఇస్రో తెలిపింది. కొంత సమయం తర్వాత నౌక నుంచి విడిపోయిన శాటిలైట్.. 38 నిమిషాలకు విజయవంతంగా తన కక్ష్యలోకి ప్రవేశించిందని అధికారులు ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తూ... అరియాన్ స్పేస్ సీఈఓ స్టెఫాన్ ఇస్రాల్ కూడా ట్వీట్ చేశారు.
ఇన్శాట్-4కు ప్రత్యామ్నాయంగా...
సమాచార శాటిలైట్ అయిన జీశాట్-30 బరువు సుమారు 3,357 కిలోలు. ఇన్శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనుంది.
ఇతర దేశాలకు సమాచారం...
భారత్తో పాటు అనుబంధ దేశాలకు ఈ ఉపగ్రహం ద్వారా కేయూ బ్యాండ్లో సిగ్నల్ అందిస్తారు. గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకూ సీ బ్యాండ్ ద్వారా సేవలు అందిస్తారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందించనున్నట్లు ఇస్రో తెలిపింది.
ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్