ETV Bharat / bharat

చిదంబరానికి ఎదురుదెబ్బ... అక్టోబర్​ 3 వరకు కస్టడీ

author img

By

Published : Sep 19, 2019, 4:21 PM IST

Updated : Oct 1, 2019, 5:21 AM IST

ఐఎన్ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీని అక్టోబర్ 3 వరకు పెంచుతూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. చిదంబరం జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయనను దిల్లీ కోర్టులో హాజరుపరిచారు.

చిదంబరానికి ఎదురుదెబ్బ
చిదంబరానికి ఎదురుదెబ్బ... అక్టోబర్​ 3 వరకు కస్టడీ

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కస్టడీని ఆగస్టు 3 వరకు పెంచుతూ దిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఐఎన్​ఎక్స్​ కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్టయిన చిదంబరం న్యాయనిర్బంధం నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయనను దిల్లీ కోర్టులో హాజరుపరిచింది సీబీఐ. మరికొన్ని రోజులపాటు కస్టడీ పెంచాలంటూ సీబీఐ.. దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ను కోరింది.

అయితే.. సీబీఐ అభ్యర్థనను చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, క్రమం తప్పకుండా చిదంబరానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు.. చిదంబరాన్ని మరో 14 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు

యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.

అనంతరం.. 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. తర్వాత విధించిన 14 రోజుల జ్యుడిషియల్​ కస్టడీ నేటితో ముగిసింది.

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్​ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: సీన్​ రివర్స్​: నాడు అమిత్​ షా.. నేడు చిదంబరం!

చిదంబరానికి ఎదురుదెబ్బ... అక్టోబర్​ 3 వరకు కస్టడీ

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కస్టడీని ఆగస్టు 3 వరకు పెంచుతూ దిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఐఎన్​ఎక్స్​ కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్టయిన చిదంబరం న్యాయనిర్బంధం నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయనను దిల్లీ కోర్టులో హాజరుపరిచింది సీబీఐ. మరికొన్ని రోజులపాటు కస్టడీ పెంచాలంటూ సీబీఐ.. దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ను కోరింది.

అయితే.. సీబీఐ అభ్యర్థనను చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, క్రమం తప్పకుండా చిదంబరానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు.. చిదంబరాన్ని మరో 14 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు

యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.

అనంతరం.. 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. తర్వాత విధించిన 14 రోజుల జ్యుడిషియల్​ కస్టడీ నేటితో ముగిసింది.

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్​ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: సీన్​ రివర్స్​: నాడు అమిత్​ షా.. నేడు చిదంబరం!

Poonch (J-K), Sep 19 (ANI): Indian Army detonated nine live mortar shells of 120mm on Sep 18. Army officials destroyed mortal shells in Sandote, Basoni and Balakote villages in Poonch district. The operation was undertaken swiftly by the disposal team, ensuring no threat to life and property.
Last Updated : Oct 1, 2019, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.