ETV Bharat / bharat

'అయోధ్య భూమిపూజకు ఆ నిందితుల్ని ఆహ్వానించాలి'

author img

By

Published : Jul 23, 2020, 1:09 PM IST

అయోధ్యలో నిర్మించనున్న రామమందిర భూమిపూజకు బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు హిందూ ధర్మసేన అధ్యక్షుడు సంతోష్ దుబే. వారిని ఆహ్వానించకపోతే భూమిపూజ కార్యక్రమం అసంపూర్తిగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.

ayodhya
'అయోధ్య భూమిపూజకు.. ఆ నిందితుల్ని ఆహ్వానించాలి'

అయోధ్య రామ మందిర భూమి పూజకు బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది నిందితులను ఆహ్వానించాలని పేర్కొన్నారు హిందూధర్మ సేన అధ్యక్షుడు సంతోష్ దుబే. భూమి పూజ సందర్భంగా వారిని సన్మానించాలని పేర్కొన్నారు. ఆగస్టు 5న జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులను ఆహ్వానించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు విన్నవించారు.

"శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు బాబ్రీ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని, రామ మందిర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కుటుంబసభ్యులను భూమి పూజకు ఆహ్వానించాలి. అక్కడ వారిని సన్మానించాలి."

-సంతోష్ దుబే, హిందూ ధర్మసేన అధ్యక్షుడు

ఒకవేళ కరసేవకులను ఆహ్వానించకపోతే దానిని అహంభావంగానే భావించాల్సి వస్తుందని చెప్పారు దుబే. భూమి పూజ కార్యక్రమం అసంపూర్తిగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.

ఈ 32 మంది బాబ్రీ కేసు నిందితుల జాబితాలో భాజపా అగ్రనేతలు ఎల్​కే అడ్వాణి, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి వారున్నారు. కేసు విచారణ ఆగస్టు 31న ముగియనుంది.

ఇదీ చూడండి: అయోధ్య రామాలయం భూమిపూజ ఇలా...

అయోధ్య రామాలయానికి ఉడుపి మట్టి

రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు

అయోధ్య రామ మందిర భూమి పూజకు బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది నిందితులను ఆహ్వానించాలని పేర్కొన్నారు హిందూధర్మ సేన అధ్యక్షుడు సంతోష్ దుబే. భూమి పూజ సందర్భంగా వారిని సన్మానించాలని పేర్కొన్నారు. ఆగస్టు 5న జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులను ఆహ్వానించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు విన్నవించారు.

"శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు బాబ్రీ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని, రామ మందిర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కుటుంబసభ్యులను భూమి పూజకు ఆహ్వానించాలి. అక్కడ వారిని సన్మానించాలి."

-సంతోష్ దుబే, హిందూ ధర్మసేన అధ్యక్షుడు

ఒకవేళ కరసేవకులను ఆహ్వానించకపోతే దానిని అహంభావంగానే భావించాల్సి వస్తుందని చెప్పారు దుబే. భూమి పూజ కార్యక్రమం అసంపూర్తిగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.

ఈ 32 మంది బాబ్రీ కేసు నిందితుల జాబితాలో భాజపా అగ్రనేతలు ఎల్​కే అడ్వాణి, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి వారున్నారు. కేసు విచారణ ఆగస్టు 31న ముగియనుంది.

ఇదీ చూడండి: అయోధ్య రామాలయం భూమిపూజ ఇలా...

అయోధ్య రామాలయానికి ఉడుపి మట్టి

రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.