ETV Bharat / bharat

దేశంలో మరింత దిగువకు యాక్టివ్​ కేసులు

author img

By

Published : Dec 13, 2020, 3:50 PM IST

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసులు తగ్గి.. రికవరీలు పెరుగుతున్నాయి. ఫలితంగా క్రియాశీలక కేసులు 3.62 శాతానికి క్షీణించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్​ ఒకటని పేర్కొంది.

India's active COVID caseload falls to 3.62 pc of total cases: Health ministry
దేశంలో 3.62 శాతానికి తగ్గిన యాక్టివ్​ కేసులు

దేశంలో కరోనా బాధితుల సంఖ్య కొన్ని వారాల నుంచి నిలకడగా తగ్గుతుండటం వల్ల క్రియాశీలక కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. ఫలితంగా యాక్టివ్​ కేసులు 3.62 శాతానికి క్షీణించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్​ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల క్రియాశీల కేసుల సంఖ్య 3,56,546కు చేరింది.

ఇతర ముఖ్యాంశాలు..

  • గడిచిన ఏడు రోజులుగా ప్రతి 10 లక్షల జనాభాకు అతి తక్కువ కేసులు నమోదవుతున్న ప్రపంచ దేశాల్లో భారత్​ ఒకటి.
  • ఇప్పటివరకు 93,57,464 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీలు, యాక్టివ్ కేసుల మధ్య వ్యత్యాసం స్థిరంగా పెరిగి.. 90 లక్షలు దాటింది.
  • కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 75.71 శాతం కేరళ, మహారాష్ట్ర, బంగాల్​, దిల్లీ, ఛత్తీస్​గఢ్​, ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, తమిళనాడు, గుజరాత్​ రాష్ట్రాల నుంచి వచ్చినవే.
  • తాజాగా కరోనాతో మరణించినవారిలో 77.78 శాతం పది రాష్ట్రాల్లో నమోదయ్యాయి. వాటిలో 79.28 శాతం మహారాష్ట్ర, దిల్లీ, బంగాల్ నుంచే కావడం గమనార్హం.

ఇదీ చూడండి: ఆ దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

దేశంలో కరోనా బాధితుల సంఖ్య కొన్ని వారాల నుంచి నిలకడగా తగ్గుతుండటం వల్ల క్రియాశీలక కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. ఫలితంగా యాక్టివ్​ కేసులు 3.62 శాతానికి క్షీణించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్​ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల క్రియాశీల కేసుల సంఖ్య 3,56,546కు చేరింది.

ఇతర ముఖ్యాంశాలు..

  • గడిచిన ఏడు రోజులుగా ప్రతి 10 లక్షల జనాభాకు అతి తక్కువ కేసులు నమోదవుతున్న ప్రపంచ దేశాల్లో భారత్​ ఒకటి.
  • ఇప్పటివరకు 93,57,464 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీలు, యాక్టివ్ కేసుల మధ్య వ్యత్యాసం స్థిరంగా పెరిగి.. 90 లక్షలు దాటింది.
  • కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 75.71 శాతం కేరళ, మహారాష్ట్ర, బంగాల్​, దిల్లీ, ఛత్తీస్​గఢ్​, ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, తమిళనాడు, గుజరాత్​ రాష్ట్రాల నుంచి వచ్చినవే.
  • తాజాగా కరోనాతో మరణించినవారిలో 77.78 శాతం పది రాష్ట్రాల్లో నమోదయ్యాయి. వాటిలో 79.28 శాతం మహారాష్ట్ర, దిల్లీ, బంగాల్ నుంచే కావడం గమనార్హం.

ఇదీ చూడండి: ఆ దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.