ETV Bharat / bharat

యూఏఈలో భారతీయుడి 'ఫిట్​నెస్​ పరుగు'

author img

By

Published : Feb 8, 2020, 9:47 PM IST

Updated : Feb 29, 2020, 4:37 PM IST

ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఓ భారతీయుడు సుదీర్ఘ పరుగును చేపట్టాడు. అబుదాబి నుంచి దుబాయ్​ వరకు 27గంటల్లోనే మారథాన్​ను పూర్తిచేసి ప్రేరణగా నిలిచాడు. తన మిత్రుడి స్ఫూర్తితో యూఏఈ యువకుల్లో ఫిట్​నెస్​పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానంటున్నాడు కేరళకు చెందిన నంబియార్​.

Indian runs from Abu Dhabi to Dubai in 27 hours
అబుదాబి నుంచి దుబాయ్​కు 27 గంటల్లో మారథాన్​

ఓ మంచి ఆశయంతో సుదీర్ఘ పరుగును చేపట్టాడు భారతీయుడు. యూఏఈలోని యువకులకు ఫిట్​నెస్​పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మారథాన్​ను చేపట్టి ​ ఘనంగా ముగించాడు కేరళకు చెందిన ఆకాశ్​ నంబియార్. జనవరి 25న అబుదాబిలోని కార్నిచ్​ నుంచి పరుగును ప్రారంభించిన నంబియార్​.. ఈ-11 రహదారి వెంట 26న దుబాయ్​లోని ఐబీఎన్​ బత్తాటాకు చేరుకున్నాడు.

27 గంటలు... 118 కిలోమీటర్లు...

అబుదాబి నుంచి దుబాయ్​ వరకు విరామం లేకుండా 27 గంటల్లోనే 118 కిలోమీటర్లు పరుగెత్తి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు నంబియార్. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​(యూఏఈ) యువకుల్లో ఫిట్​నెస్​పై అవగాహన కల్పించడం కోసమే ఈ సాహసం చేసినట్లు చెప్పాడు.

'యూఏఈలో ఊబకాయం, ధూమపానం ఎక్కువగా ఉంది. 35 ఏళ్లలోపు వారు కూడా శారీరకంగా చురుకుగా ఉండట్లేదు. యువకులు ఫిట్​నెస్​ను విస్మరిస్తున్నారు. వారికి ఆరోగ్యం ఆవశ్యకతను తెలియజేయాలనుకున్నా. అందుకే ఈ కార్యక్రమం చేపట్టా. ఈ విషయంలో నా మిత్రుడు ఖలీద్​ నాకు స్ఫూర్తి. అతడు అబుదాబి నుంచి మక్కాకు పరుగెత్తాడు. అతని నుంచే ప్రేరణ పొందాను.'
- ఆకాశ్​ నంబియార్​

ఇలా పరుగెత్తడం నంబియార్​కు కొత్తేమీ కాదు. గతంలో శ్రీలంకలోని కొలంబో నుంచి పూణవాతున వరకు 120 కిలోమీటర్ల మారథాన్​లో పాల్గొన్నాడు. రాబోయే ఐదు నెలల్లోనే మరో సుదీర్ఘ రన్​కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇదీ చూడండి: ఈ రైతును తేనెటీగలు కుట్టవు.. ఎందుకో తెలుసా?

ఓ మంచి ఆశయంతో సుదీర్ఘ పరుగును చేపట్టాడు భారతీయుడు. యూఏఈలోని యువకులకు ఫిట్​నెస్​పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మారథాన్​ను చేపట్టి ​ ఘనంగా ముగించాడు కేరళకు చెందిన ఆకాశ్​ నంబియార్. జనవరి 25న అబుదాబిలోని కార్నిచ్​ నుంచి పరుగును ప్రారంభించిన నంబియార్​.. ఈ-11 రహదారి వెంట 26న దుబాయ్​లోని ఐబీఎన్​ బత్తాటాకు చేరుకున్నాడు.

27 గంటలు... 118 కిలోమీటర్లు...

అబుదాబి నుంచి దుబాయ్​ వరకు విరామం లేకుండా 27 గంటల్లోనే 118 కిలోమీటర్లు పరుగెత్తి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు నంబియార్. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​(యూఏఈ) యువకుల్లో ఫిట్​నెస్​పై అవగాహన కల్పించడం కోసమే ఈ సాహసం చేసినట్లు చెప్పాడు.

'యూఏఈలో ఊబకాయం, ధూమపానం ఎక్కువగా ఉంది. 35 ఏళ్లలోపు వారు కూడా శారీరకంగా చురుకుగా ఉండట్లేదు. యువకులు ఫిట్​నెస్​ను విస్మరిస్తున్నారు. వారికి ఆరోగ్యం ఆవశ్యకతను తెలియజేయాలనుకున్నా. అందుకే ఈ కార్యక్రమం చేపట్టా. ఈ విషయంలో నా మిత్రుడు ఖలీద్​ నాకు స్ఫూర్తి. అతడు అబుదాబి నుంచి మక్కాకు పరుగెత్తాడు. అతని నుంచే ప్రేరణ పొందాను.'
- ఆకాశ్​ నంబియార్​

ఇలా పరుగెత్తడం నంబియార్​కు కొత్తేమీ కాదు. గతంలో శ్రీలంకలోని కొలంబో నుంచి పూణవాతున వరకు 120 కిలోమీటర్ల మారథాన్​లో పాల్గొన్నాడు. రాబోయే ఐదు నెలల్లోనే మరో సుదీర్ఘ రన్​కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇదీ చూడండి: ఈ రైతును తేనెటీగలు కుట్టవు.. ఎందుకో తెలుసా?

Intro:Body:Conclusion:
Last Updated : Feb 29, 2020, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.