ETV Bharat / bharat

ఏఎన్​-32 విమానంలో గల్లంతైన వారంతా మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో కుప్పకూలిన ఏఎన్​-32 విమానంలోని అందరూ మరణించినట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణించిన 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

author img

By

Published : Jun 13, 2019, 3:53 PM IST

Updated : Jun 13, 2019, 7:46 PM IST

'ఏఎన్​-32 విమాన ప్రమాదంలో అందరూ మృతి'
ఏఎన్​-32 విమానంలో గల్లంతైన వారంతా మృతి

జూన్‌3వ తేదీన అరుణాచల్​ ప్రదేశ్​ సియాంగ్ జిల్లా పయూమ్‌ పరిధిలో ఏఎన్​-32 విమానం గల్లంతయింది. ఈ విమానంలో ప్రయాణించిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన అధికారికంగా ట్విట్టర్​ ద్వారా తెలిపింది.

విమాన శకలాలను గుర్తించిన ప్రాంతాన్ని బుధవారం తనిఖీ బృందాలు జల్లెడ పట్టాయి. ఈ గాలింపులో ఎవరూ సజీవంగా లేరని వెల్లడైంది. అమర వీరులకు నివాళులు అర్పించిన భారత వాయుసేన.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

ఏం జరిగింది..?

జూన్ 3 మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్​ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది ఏఎన్​-32 విమానం. కొద్ది సేపటికే విమానం గల్లంతైంది. అది అరుణాచల్ ప్రదేశ్​ మెన్చుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్​కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి 13 మంది ఉన్నారు.

ఏఎన్​-32 విమానంలో గల్లంతైన వారంతా మృతి

జూన్‌3వ తేదీన అరుణాచల్​ ప్రదేశ్​ సియాంగ్ జిల్లా పయూమ్‌ పరిధిలో ఏఎన్​-32 విమానం గల్లంతయింది. ఈ విమానంలో ప్రయాణించిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన అధికారికంగా ట్విట్టర్​ ద్వారా తెలిపింది.

విమాన శకలాలను గుర్తించిన ప్రాంతాన్ని బుధవారం తనిఖీ బృందాలు జల్లెడ పట్టాయి. ఈ గాలింపులో ఎవరూ సజీవంగా లేరని వెల్లడైంది. అమర వీరులకు నివాళులు అర్పించిన భారత వాయుసేన.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

ఏం జరిగింది..?

జూన్ 3 మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్​ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది ఏఎన్​-32 విమానం. కొద్ది సేపటికే విమానం గల్లంతైంది. అది అరుణాచల్ ప్రదేశ్​ మెన్చుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్​కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి 13 మంది ఉన్నారు.

Kolkata, Jun 13 (ANI): The strike by junior doctors of NRS Medical College and Hospital continued in West Bengal's Kolkata. The doctors went on strike on Tuesday after one of their colleagues was allegedly attacked by the family of a patient who died on June 10. Patients said that they were not allowed to enter the hospital and were suffering due to lack of treatment. The junior doctors locked the hospital gates, stopped work at the outpatient department (OPD) and started a dharna in protest against the attack. Adequate security arrangements were made.
Last Updated : Jun 13, 2019, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.