ETV Bharat / bharat

ఎస్​సీఓ భేటీలో పాక్​ తప్పుడు మ్యాప్​.. భారత్​ వాకౌట్​

author img

By

Published : Sep 15, 2020, 8:34 PM IST

రష్యా నేతృత్వంలో జరిగిన ఎస్​సీఓ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాకిస్థాన్​ తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. భారత భూభాగానికి చెందిన కొన్ని ప్రాంతాలను తన సరిహద్దులో చేర్చుకుని ఓ మ్యాప్​ను ప్రవేశపెట్టింది. దీనిపై ఆగ్రహించిన భారత్​.. వర్చువల్​ సమావేశం నుంచి వాకౌట్​ చేసింది.

India walks out of SCO meet after Pak representative projects 'fictitious map'
ఎస్​సీఓ భేటీలో పాక్​ వక్రబుద్ధి.. భారత్​ వాకౌట్​

పాకిస్థాన్​ మరోమారు తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఓ తప్పుడు మ్యాప్​ను రూపొందించి.. ఎస్​సీఓ(షాంఘై కోపరేషన్​ ఆర్గనైజేషన్​) జాతీయ భద్రతా సలహాదారుల సమవేశంలో ప్రవేశపెట్టింది. ఈ కల్పిత మ్యాప్​లో.. భారత్​లోని కొంత భూభాగాన్ని తమ దేశంలోకి చేర్చుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్​... సమావేశం నుంచి వాకౌట్​ చేసింది.

"రష్యా నేతృత్వంలో జరిగిన ఈ వర్చువల్​ భేటీ ద్వారా పాక్​ వక్రబుద్ధి మరోమారు బయటపడింది. తన చర్యల ద్వారా సమావేశ నిబంధనలను ఉల్లంఘించింది​. రష్యా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన అనంతరం.. సమావేశం నుంచి భారత్​ వాకౌట్​ చేసింది."

--- అనురాగ్​ శ్రీవాస్తవ, విదేశాంగశాఖ ప్రతినిధి.

ఇదీ చూడండి:- కాల్పుల విరమణకు పాక్ తూట్లు- 3 వేల సార్లు ఉల్లంఘన

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... సభ్య దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను భద్రపరచడం ఎస్​సీఓ నిబంధనలో ముఖ్యమైనది. దీనికి పాక్​ తూట్లు పొడిచింది. ఈ అక్రమ మ్యాప్​ను పాక్​ ఉపయోగించడాన్ని భారత్​ తీవ్రంగా వ్యతిరేకించింది. వైఖరిని మార్చుకోవాలని రష్యా కూడా పాక్​కు విజ్ఞప్తి చేసింది.

పాకిస్థాన్​ ప్రధానికి జాతీయ సలహాదారు మోయిద్​ యూసఫ్​, రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి నికోలియా పాట్రోషెవ్​, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం.

ఈ ఘటన అనంతరం.. భారత్​తో రష్యా వ్యక్తిగతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. పాక్​ చర్యలకు తాము మద్దతివ్వడం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇరు దేశాల బంధానికి ఇది అడ్డుగా మారకూడదని పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:- 'సొరంగాల ద్వారా ఉగ్రవాదులు- డ్రోన్లతో ఆయుధాలు'

పాకిస్థాన్​ మరోమారు తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఓ తప్పుడు మ్యాప్​ను రూపొందించి.. ఎస్​సీఓ(షాంఘై కోపరేషన్​ ఆర్గనైజేషన్​) జాతీయ భద్రతా సలహాదారుల సమవేశంలో ప్రవేశపెట్టింది. ఈ కల్పిత మ్యాప్​లో.. భారత్​లోని కొంత భూభాగాన్ని తమ దేశంలోకి చేర్చుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్​... సమావేశం నుంచి వాకౌట్​ చేసింది.

"రష్యా నేతృత్వంలో జరిగిన ఈ వర్చువల్​ భేటీ ద్వారా పాక్​ వక్రబుద్ధి మరోమారు బయటపడింది. తన చర్యల ద్వారా సమావేశ నిబంధనలను ఉల్లంఘించింది​. రష్యా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన అనంతరం.. సమావేశం నుంచి భారత్​ వాకౌట్​ చేసింది."

--- అనురాగ్​ శ్రీవాస్తవ, విదేశాంగశాఖ ప్రతినిధి.

ఇదీ చూడండి:- కాల్పుల విరమణకు పాక్ తూట్లు- 3 వేల సార్లు ఉల్లంఘన

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... సభ్య దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను భద్రపరచడం ఎస్​సీఓ నిబంధనలో ముఖ్యమైనది. దీనికి పాక్​ తూట్లు పొడిచింది. ఈ అక్రమ మ్యాప్​ను పాక్​ ఉపయోగించడాన్ని భారత్​ తీవ్రంగా వ్యతిరేకించింది. వైఖరిని మార్చుకోవాలని రష్యా కూడా పాక్​కు విజ్ఞప్తి చేసింది.

పాకిస్థాన్​ ప్రధానికి జాతీయ సలహాదారు మోయిద్​ యూసఫ్​, రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి నికోలియా పాట్రోషెవ్​, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం.

ఈ ఘటన అనంతరం.. భారత్​తో రష్యా వ్యక్తిగతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. పాక్​ చర్యలకు తాము మద్దతివ్వడం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇరు దేశాల బంధానికి ఇది అడ్డుగా మారకూడదని పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:- 'సొరంగాల ద్వారా ఉగ్రవాదులు- డ్రోన్లతో ఆయుధాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.