ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒక్కరోజే 3307 కేసులు, 114 మరణాలు

author img

By

Published : Jun 17, 2020, 9:13 PM IST

Updated : Jun 17, 2020, 11:08 PM IST

కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 3,307 కేసులు, 114 మరణాలు సంభవించాయి. మరోవైపు తమిళనాడులో కొత్తగా 2,174 కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి.

india virus cases daily updates
కరోనా డెత్​ టోల్

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 3,307 కేసులు, 114 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,16,752కి, మరణాల సంఖ్య 5651కి పెరిగింది.

  • తమిళనాడులో ఇవాళ మరో 2,174 మంది కొవిడ్​ బారినపడ్డారు. 48 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 50,193కి చేరింది. మృతుల సంఖ్య 576కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో మొదటిసారిగా ఒక్క రోజులో 25,000 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది.
  • దిల్లీలో కొత్తగా 2,414 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరోవైపు ఇవాళ 67 మంది కొవిడ్​ బారినపడి మరణించారు. దిల్లీలో ఇప్పటి వరకు 47,102 కేసులు, 1904 మరణాలు నమోదుకాగా... 1,745 మంది కోలుకున్నారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 583 కొవిడ్​ కేసులు, 30 మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో రాష్ట్రంలో ఇదే అత్యధికం. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,181కి, మరణాలు 465కి చేరుకున్నాయి.
  • గుజరాత్​లో మరో 520 కేసులు, 27 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 25 వేలు దాటగా.. మరణాలు 1,561కి పెరిగాయి.
  • మధ్యప్రదేశ్​లో మరో 44 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4,134కి చేరింది.
  • కర్ణాటకలో గడచిన 24 గంటల్లో 204 పాజిటివ్ కేసులు, 8 మరణాలు సంభవించాయి.
  • పంజాబ్​లో ఇవాళ 126 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.
  • అసోంలో కొత్తగా నమోదైన 95 కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 4,605కి పెరిగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,183 యాక్టివ్ కేసులున్నాయి.
  • బంగాల్​లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇవాళ అక్కడ 391 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు 6,533 మంది కోలుకోవడం కాస్త ఊరట.
  • రాజస్థాన్​లో మరో 326 మంది కొవిడ్ బారిన పడగా.. ఐదుగురు మరణించారు. దీనితో ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 13,542కి, మరణాలు 313కి పెరిగాయి. ఇప్పటి వరకు 10,034 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
  • హిమాచల్​ప్రదేశ్​లో కొత్తగా 2 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 570 కేసులు, 6 మరణాలు సంభవించాయి. మరో 365 మంది కోలుకున్నారు.

మరోవైపు పలువురు ప్రజాప్రతినిధులు కొవిడ్-19 బారిన పడుతున్నారు. తాజాగా దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఆప్​ జాతీయ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అతిశీ, బిహార్​లో ఆర్​జేడీ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కరోనా బారిన పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి వక్తిగత కార్యదర్శి కొవిడ్​ బారిన పడి మరణించారు.

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం కొత్త కేసులుకొత్త మరణాలుమొత్తం కేసులు
మహారాష్ట్ర3,307114 1,16,752
తమిళనాడు2,174 48 50,193
ఉత్తర్​ప్రదేశ్58330 15,181
గుజరాత్​520 27 25,148
కర్ణాటక20487,734
మధ్యప్రదేశ్44N/A 4,134
పంజాబ్​126N/A3,497
బంగాల్​ 39111 N/A
రాజస్థాన్​326513,542

ఇదీ చూడండి: 'సరిహద్దు ఉద్రిక్త ఘటనపై చైనాదే బాధ్యత'

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 3,307 కేసులు, 114 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,16,752కి, మరణాల సంఖ్య 5651కి పెరిగింది.

  • తమిళనాడులో ఇవాళ మరో 2,174 మంది కొవిడ్​ బారినపడ్డారు. 48 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 50,193కి చేరింది. మృతుల సంఖ్య 576కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో మొదటిసారిగా ఒక్క రోజులో 25,000 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది.
  • దిల్లీలో కొత్తగా 2,414 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరోవైపు ఇవాళ 67 మంది కొవిడ్​ బారినపడి మరణించారు. దిల్లీలో ఇప్పటి వరకు 47,102 కేసులు, 1904 మరణాలు నమోదుకాగా... 1,745 మంది కోలుకున్నారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 583 కొవిడ్​ కేసులు, 30 మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో రాష్ట్రంలో ఇదే అత్యధికం. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,181కి, మరణాలు 465కి చేరుకున్నాయి.
  • గుజరాత్​లో మరో 520 కేసులు, 27 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 25 వేలు దాటగా.. మరణాలు 1,561కి పెరిగాయి.
  • మధ్యప్రదేశ్​లో మరో 44 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4,134కి చేరింది.
  • కర్ణాటకలో గడచిన 24 గంటల్లో 204 పాజిటివ్ కేసులు, 8 మరణాలు సంభవించాయి.
  • పంజాబ్​లో ఇవాళ 126 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.
  • అసోంలో కొత్తగా నమోదైన 95 కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 4,605కి పెరిగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,183 యాక్టివ్ కేసులున్నాయి.
  • బంగాల్​లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇవాళ అక్కడ 391 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు 6,533 మంది కోలుకోవడం కాస్త ఊరట.
  • రాజస్థాన్​లో మరో 326 మంది కొవిడ్ బారిన పడగా.. ఐదుగురు మరణించారు. దీనితో ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 13,542కి, మరణాలు 313కి పెరిగాయి. ఇప్పటి వరకు 10,034 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
  • హిమాచల్​ప్రదేశ్​లో కొత్తగా 2 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 570 కేసులు, 6 మరణాలు సంభవించాయి. మరో 365 మంది కోలుకున్నారు.

మరోవైపు పలువురు ప్రజాప్రతినిధులు కొవిడ్-19 బారిన పడుతున్నారు. తాజాగా దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఆప్​ జాతీయ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అతిశీ, బిహార్​లో ఆర్​జేడీ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కరోనా బారిన పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి వక్తిగత కార్యదర్శి కొవిడ్​ బారిన పడి మరణించారు.

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం కొత్త కేసులుకొత్త మరణాలుమొత్తం కేసులు
మహారాష్ట్ర3,307114 1,16,752
తమిళనాడు2,174 48 50,193
ఉత్తర్​ప్రదేశ్58330 15,181
గుజరాత్​520 27 25,148
కర్ణాటక20487,734
మధ్యప్రదేశ్44N/A 4,134
పంజాబ్​126N/A3,497
బంగాల్​ 39111 N/A
రాజస్థాన్​326513,542

ఇదీ చూడండి: 'సరిహద్దు ఉద్రిక్త ఘటనపై చైనాదే బాధ్యత'

Last Updated : Jun 17, 2020, 11:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.