ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 10 వేల 956 మంది వైరస్ బారినపడ్డారు. మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు కేసులు, మరణాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
![India reports the highest single-day spike of 10,956 new #COVID19 cases & 396 deaths](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7581251_india-glance-2-1.jpg)
మహారాష్ట్రలో అత్యధికంగా 3590 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 97 వేలు దాటింది. గుజరాత్లో 1385 మంది, మధ్యప్రదేశ్లో 431, బంగాల్లో 442 మంది మరణించారు.