ETV Bharat / bharat

బాబ్రీ తీర్పుపై పాక్​ విమర్శలకు భారత్​ గట్టిజవాబు

author img

By

Published : Oct 2, 2020, 6:04 AM IST

బాబ్రీ మసీదు కేసు తీర్పు విషయంలో పాకిస్థాన్​ చేసిన విమర్శలను తిప్పికొట్టింది భారత్​. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకునే శక్తి దాయాది దేశానికి లేదని స్పష్టం చేసింది. ఇటీవల సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించిన తీర్పును పాక్​ తప్పుబట్టిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇలా స్పందించింది.

India rejects Pak criticism of court ruling in Babri Masjid case
బాబ్రీ తీర్పుపై పాక్​ విమర్శలకు భారత్​ గట్టిజవాబు

బాబ్రీ తీర్పు విషయంలో పాకిస్థాన్‌ చేసిన విమర్శలను భారత్‌ దీటు జవాబిచ్చింది. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకునే శక్తి పాక్‌కు లేదని స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించడాన్ని పాక్​ విదేశాంగ కార్యాలయం తప్పుబట్టింది. మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు రక్షణ కల్పించాలని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: బాబ్రీ కేసు తీర్పును ఖండించిన పాక్​

ఈ నేపథ్యంలో పాక్​ వ్యాఖ్యలను ఖండించారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ. భారత్​ పరిపక్వత గల ప్రజాస్వామిక దేశమని.. కోర్టు తీర్పుల పట్ల ప్రభుత్వం, ప్రజలు విధేయత చూపిస్తారని స్పష్టం చేశారు. అయితే అధికార వ్యవస్థను ఇష్టానుసారం వినియోగించి.. ప్రజలను, కోర్టులను నోరు మెదపకుండా చేసే నిర్భంద వ్యవస్థకు ఈ ప్రజాస్వామ్య విలువలు అర్థం కావని ఆయన విమర్శించారు.

గతంలోనూ అనేక మార్లు భారత అంతర్గత విషయాల్లో పాకిస్థాన్​ జోక్యం చేసుకుంది. ఆయా సందర్భాల్లో దాయాది​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది భారత్​.

బాబ్రీ కేసులో 28ఏళ్ల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. సెప్టెంబర్​ 30న తీర్పును వెలువరించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి సహా 32మందిని నిర్దోషులుగా తేల్చింది.

బాబ్రీ తీర్పు విషయంలో పాకిస్థాన్‌ చేసిన విమర్శలను భారత్‌ దీటు జవాబిచ్చింది. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకునే శక్తి పాక్‌కు లేదని స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించడాన్ని పాక్​ విదేశాంగ కార్యాలయం తప్పుబట్టింది. మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు రక్షణ కల్పించాలని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: బాబ్రీ కేసు తీర్పును ఖండించిన పాక్​

ఈ నేపథ్యంలో పాక్​ వ్యాఖ్యలను ఖండించారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ. భారత్​ పరిపక్వత గల ప్రజాస్వామిక దేశమని.. కోర్టు తీర్పుల పట్ల ప్రభుత్వం, ప్రజలు విధేయత చూపిస్తారని స్పష్టం చేశారు. అయితే అధికార వ్యవస్థను ఇష్టానుసారం వినియోగించి.. ప్రజలను, కోర్టులను నోరు మెదపకుండా చేసే నిర్భంద వ్యవస్థకు ఈ ప్రజాస్వామ్య విలువలు అర్థం కావని ఆయన విమర్శించారు.

గతంలోనూ అనేక మార్లు భారత అంతర్గత విషయాల్లో పాకిస్థాన్​ జోక్యం చేసుకుంది. ఆయా సందర్భాల్లో దాయాది​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది భారత్​.

బాబ్రీ కేసులో 28ఏళ్ల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. సెప్టెంబర్​ 30న తీర్పును వెలువరించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి సహా 32మందిని నిర్దోషులుగా తేల్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.