ETV Bharat / bharat

భారత్​లో మరో కరోనా కేసు.. రెండోది కేరళలోనే

author img

By

Published : Feb 2, 2020, 11:00 AM IST

Updated : Feb 28, 2020, 8:53 PM IST

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా.. కేరళను సైతం గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్​ బారినపడి ఓ కేరళ విద్యార్థిని చికిత్స పొందుతుండగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అటు ఫిలిప్పైన్స్​లోనూ ఈ ప్రాణాంతక వైరస్​తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫలితంగా చైనా తర్వాత కరోనా మృతుల కేసు నమోదు చేసిన తొలి దేశంగా ఫిలిప్పైన్స్​ నిలిచింది.

India registered second case of corona, Philippines registered first death out of china
భారత్​లో మరో కరోనా కేసు, ఫిలిప్పైన్స్​లోనూ ఒకరు మృతి

ప్రాణాంతక కరోనా వైరస్​తో ఇప్పటికే కేరళకు చెందిన ఓ వైద్య విద్యార్థిని చికిత్స పొందుతుండగా.. తాజాగా మరో కేసు నమోదైంది. అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తికి ఈ ప్రమాదకర వైరస్ సోకినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. చైనాకు వెళ్లివచ్చినందునే రోగికి​ వైరస్​ సోకిందని తెలిపారు. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

వుహాన్​ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ యువతికి ఇటీవలే కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. అలాగే ఈ ప్రాణాంతక వైరస్​ వ్యాప్తిపై తప్పుడు ప్రచారాలు చేసిన ముగ్గురు కేరళ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చైనా తర్వాత ఫిలిప్పైన్స్​లోనే తొలి కేసు

కరోనా వైరస్​తో చైనాలో ఇప్పటివరకు మూడొందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనం ఈ వైరస్​ బారిన పడ్డారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్​తో చైనా తర్వాత మృత్యు కేసు నమోదు చేసిన తొలి దేశంగా ఫిలిప్పైన్స్​ నిలిచింది.​ ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే మృతుడు చైనాలోని వుహాన్​కు చెందిన వ్యక్తేనని తెలిపింది. అతనికి ఫిలిప్పైన్స్​ రాకముందే కరోనా సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రాణాంతక కరోనా వైరస్​తో ఇప్పటికే కేరళకు చెందిన ఓ వైద్య విద్యార్థిని చికిత్స పొందుతుండగా.. తాజాగా మరో కేసు నమోదైంది. అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తికి ఈ ప్రమాదకర వైరస్ సోకినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. చైనాకు వెళ్లివచ్చినందునే రోగికి​ వైరస్​ సోకిందని తెలిపారు. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

వుహాన్​ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ యువతికి ఇటీవలే కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. అలాగే ఈ ప్రాణాంతక వైరస్​ వ్యాప్తిపై తప్పుడు ప్రచారాలు చేసిన ముగ్గురు కేరళ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చైనా తర్వాత ఫిలిప్పైన్స్​లోనే తొలి కేసు

కరోనా వైరస్​తో చైనాలో ఇప్పటివరకు మూడొందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనం ఈ వైరస్​ బారిన పడ్డారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్​తో చైనా తర్వాత మృత్యు కేసు నమోదు చేసిన తొలి దేశంగా ఫిలిప్పైన్స్​ నిలిచింది.​ ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే మృతుడు చైనాలోని వుహాన్​కు చెందిన వ్యక్తేనని తెలిపింది. అతనికి ఫిలిప్పైన్స్​ రాకముందే కరోనా సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Intro:Body:

anti-social-elements-in-connivance-with-some-political-parties-planning-violence-on-feb-2-aap-to-ec20200202064032/


Conclusion:
Last Updated : Feb 28, 2020, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.