ETV Bharat / bharat

సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!

author img

By

Published : Jun 27, 2020, 6:25 PM IST

Updated : Jun 27, 2020, 6:54 PM IST

చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదం ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు యుద్ధ వాతావారణాన్ని సృష్టిస్తున్న చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా సమాయత్తమైంది. పెద్దఎత్తున యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లతోపాటు ఆకాష్‌ వంటి అధునాతన క్షిపణులను కూడా మోహరించింది.

India moves air defence missile systems into Eastern Ladakh sector
సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!

గల్వాన్‌ లోయలో చైనా దొంగదెబ్బ తీసి కర్నల్‌ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లను బలితీసుకున్న తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ వైపు సైనికాధికారుల స్థాయి చర్చలు జరుపుతూనే మరోవైపు పెద్దఎత్తున బలగాలను మోహరిస్తూ చైనా దుర్నీతిని ప్రదర్శిస్తూనే ఉంది.

ఇప్పటికే యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో వాస్తవాధీన రేఖ వద్ద చైనా అలజడి సృష్టిస్తోంది. భారత్‌ సైతం అందుకు దీటుగా స్పందిస్తోంది. ఇప్పటికే భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వద్ద చక్కర్లు కొడుతూ.. శత్రుదేశం కదలికలను గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తక్షణం స్పందించేందుకు అధునాతన క్షిపణులను కూడా ఎల్​ఏసీ వద్ద భారత్‌ మోహరించింది.

లద్దాఖ్ వద్ద సర్వం సిద్ధం

భూఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి రక్షణ వ్యవస్థలను తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌కు తరలించింది. చైనా ఆర్మీతోపాటు, ఫైటర్‌ జెట్ల ద్వారా వైమానిక దళం ఏదైనా దాడికి పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యంతో పాటు ఎయిర్​ఫోర్స్​కు చెందిన రక్షణ వ్యవస్థలను తూర్పు లద్దాఖ్‌ వద్ద సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

డ్రాగన్ దూకుడు

కొద్దివారాలుగా.. చైనా సైన్యం అధునాతన సుఖోయ్‌-30 యుద్ధ విమానాలతోపాటు వ్యూహాత్మక బాంబర్లను భారత సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరం వరకూ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎల్​ఏసీలోని దౌలత్‌బేగ్‌, గల్వాన్‌ లోయలోని 14, 15, 17వ పెట్రోలింగ్‌ పాయింట్లతో పాటు 17A పెట్రోలింగ్‌ పాయింట్ అయిన హాట్‌స్ప్రింగ్‌ ప్రాంతం వద్ద చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

చైనాకు దీటుగా

ఇదేతరహాలో భారత్‌ కూడా భారీ సామర్థ్యం కలిగిన వైమానిక రక్షణ వ్యవస్థలను సరిహద్దుల వద్దకు తరలించినట్లు సమాచారం. క్షణాల్లోనే సంధించే అవకాశం ఉన్న ఆకాష్‌ క్షిపణిని కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాల నుంచి ప్రయోగించేందుకు క్షిపణికి అవసరమైన మార్పులు చేసినట్లు సమాచారం. సరిహద్దుల్లో నిఘాపరంగా మరింత అప్రమత్తమైనట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి

గల్వాన్‌ లోయలో చైనా దొంగదెబ్బ తీసి కర్నల్‌ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లను బలితీసుకున్న తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ వైపు సైనికాధికారుల స్థాయి చర్చలు జరుపుతూనే మరోవైపు పెద్దఎత్తున బలగాలను మోహరిస్తూ చైనా దుర్నీతిని ప్రదర్శిస్తూనే ఉంది.

ఇప్పటికే యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో వాస్తవాధీన రేఖ వద్ద చైనా అలజడి సృష్టిస్తోంది. భారత్‌ సైతం అందుకు దీటుగా స్పందిస్తోంది. ఇప్పటికే భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వద్ద చక్కర్లు కొడుతూ.. శత్రుదేశం కదలికలను గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తక్షణం స్పందించేందుకు అధునాతన క్షిపణులను కూడా ఎల్​ఏసీ వద్ద భారత్‌ మోహరించింది.

లద్దాఖ్ వద్ద సర్వం సిద్ధం

భూఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి రక్షణ వ్యవస్థలను తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌కు తరలించింది. చైనా ఆర్మీతోపాటు, ఫైటర్‌ జెట్ల ద్వారా వైమానిక దళం ఏదైనా దాడికి పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యంతో పాటు ఎయిర్​ఫోర్స్​కు చెందిన రక్షణ వ్యవస్థలను తూర్పు లద్దాఖ్‌ వద్ద సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

డ్రాగన్ దూకుడు

కొద్దివారాలుగా.. చైనా సైన్యం అధునాతన సుఖోయ్‌-30 యుద్ధ విమానాలతోపాటు వ్యూహాత్మక బాంబర్లను భారత సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరం వరకూ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎల్​ఏసీలోని దౌలత్‌బేగ్‌, గల్వాన్‌ లోయలోని 14, 15, 17వ పెట్రోలింగ్‌ పాయింట్లతో పాటు 17A పెట్రోలింగ్‌ పాయింట్ అయిన హాట్‌స్ప్రింగ్‌ ప్రాంతం వద్ద చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

చైనాకు దీటుగా

ఇదేతరహాలో భారత్‌ కూడా భారీ సామర్థ్యం కలిగిన వైమానిక రక్షణ వ్యవస్థలను సరిహద్దుల వద్దకు తరలించినట్లు సమాచారం. క్షణాల్లోనే సంధించే అవకాశం ఉన్న ఆకాష్‌ క్షిపణిని కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాల నుంచి ప్రయోగించేందుకు క్షిపణికి అవసరమైన మార్పులు చేసినట్లు సమాచారం. సరిహద్దుల్లో నిఘాపరంగా మరింత అప్రమత్తమైనట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి

Last Updated : Jun 27, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.