ETV Bharat / bharat

పర్యావరణహితంగా అభివృద్ధి యజ్ఞం: మోదీ - modi said conserve migratory birds

పర్యావరణానికి హాని కలగని రీతిలో తమ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్రమోదీ. గుజరాత్​లోని గాంధీనగర్​లో నిర్వహించిన వలసజాతుల సంరక్షణ( సీఎంఎస్​) సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మధ్య ఆసియా ఫ్లైవే వెంట వలస పక్షులను సంరక్షించడానికి భారతదేశం జాతీయ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు.

India has prepared national action plan to conserve migratory birds along Central Asia flyway
వలస పక్షులు ప్రపంచాన్ని ఏకం చేస్తాయి: ప్రధాని
author img

By

Published : Feb 17, 2020, 11:28 AM IST

Updated : Mar 1, 2020, 2:38 PM IST

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి, పర్యావరణ హిత అభివృద్ధే ప్రధాన సూత్రాలుగా వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు భారత్​ కృషి చేస్తోందని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోదీ. భూతాపం తగ్గించే విషయంలో పారిస్​ ఒప్పందానికి లోబడి పనిచేస్తున్న దేశాల్లో భారత్​ ఒకటని గుర్తు చేశారు.

గుజరాత్​ గాంధీనగర్​లో జరుగుతున్న వలస జాతుల సంరక్షణ సదస్సును ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు మోదీ. మధ్య ఆసియా ఫ్లైవే వెంట వలస పక్షుల సంరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

వలస పక్షుల పరిరక్షణకు జాతీయ కార్యాచరణ: మోదీ

"భారత్​ 7500 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉంది. సముద్రతీర జలాల్లో జీవ వైవిధ్యం ఉంటుంది. వాటి పరిరక్షణే లక్ష్యంగా ఆసియాన్​, తూర్పు ఆసియా సమ్మిట్ దేశాల బంధం బలపడాలి. ఇందుకోసం 'ఇండో-పసిఫిక్ ఓసియన్​ ఇనిషియేటివ్ (ఐపీఓఐ)'ను ప్రతిపాదిస్తున్నా. దీనికి భారత్​ నాయకత్వం వహిస్తుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి, పర్యావరణ హిత అభివృద్ధే ప్రధాన సూత్రాలుగా వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు భారత్​ కృషి చేస్తోందని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోదీ. భూతాపం తగ్గించే విషయంలో పారిస్​ ఒప్పందానికి లోబడి పనిచేస్తున్న దేశాల్లో భారత్​ ఒకటని గుర్తు చేశారు.

గుజరాత్​ గాంధీనగర్​లో జరుగుతున్న వలస జాతుల సంరక్షణ సదస్సును ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు మోదీ. మధ్య ఆసియా ఫ్లైవే వెంట వలస పక్షుల సంరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

వలస పక్షుల పరిరక్షణకు జాతీయ కార్యాచరణ: మోదీ

"భారత్​ 7500 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉంది. సముద్రతీర జలాల్లో జీవ వైవిధ్యం ఉంటుంది. వాటి పరిరక్షణే లక్ష్యంగా ఆసియాన్​, తూర్పు ఆసియా సమ్మిట్ దేశాల బంధం బలపడాలి. ఇందుకోసం 'ఇండో-పసిఫిక్ ఓసియన్​ ఇనిషియేటివ్ (ఐపీఓఐ)'ను ప్రతిపాదిస్తున్నా. దీనికి భారత్​ నాయకత్వం వహిస్తుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Last Updated : Mar 1, 2020, 2:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.