ETV Bharat / bharat

పాక్​ పౌరులను స్వదేశానికి పంపేందుకు కేంద్రం అనుమతి - పాకిస్థాన్​ హై కమిషన్​

భారత్​లో ఉన్న తమ పౌరులను స్వదేశానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది పాకిస్థాన్​ హై కమిషన్​. దీనికి స్పందించిన కేంద్రం.. వారిని పంపించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

India facilitating return of 180 stranded Pakistanis
పాక్​ పౌరులను స్వదేశానికి పంపేందుకు కేంద్రం అనుమతి
author img

By

Published : Apr 15, 2020, 10:36 PM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో సరిహద్దులను భారత్​ మూసివేసింది. దీంతో చాలా మంది విదేశీయులు దేశంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో భారత్​లో ఉన్న తమ 180 మంది పౌరులను స్వదేశానికి వెళ్లడానికి అనుమతినివ్వాలని పాకిస్థాన్​ హై కిమిషన్​ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్​ పౌరులను స్వదేశానికి పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

"ప్రస్తుతం భారత్​లో ఉన్న 180 మంది పాక్​ పౌరులను స్వదేశానికి పంపాలని పాకిస్థాన్​ హైకమిషన్​ చేసిన అభ్యర్థనను అర్థం చేసుకున్నాం. వారిని పాక్​కు పంపడానికి సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాం."

-భారత విదేశాంగ శాఖ ప్రతినిధి

180 మంది పాక్​ పౌరులను గురువారం ఉదయం 10 గంటలకు అటారీ- వాఘా సరిహద్దు నుంచి పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో కూడా ఐదుగురు పాకిస్థానీయులు సురక్షితంగా వారి దేశానికి చేరుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది పాకిస్థానీయులు మెడికల్​ వీసా మీద భారత్​కు వస్తుంటారు.

అలాగే ఇతర దేశస్థులను కూడా వారి వారి దేశాలకు పంపటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో సరిహద్దులను భారత్​ మూసివేసింది. దీంతో చాలా మంది విదేశీయులు దేశంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో భారత్​లో ఉన్న తమ 180 మంది పౌరులను స్వదేశానికి వెళ్లడానికి అనుమతినివ్వాలని పాకిస్థాన్​ హై కిమిషన్​ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్​ పౌరులను స్వదేశానికి పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

"ప్రస్తుతం భారత్​లో ఉన్న 180 మంది పాక్​ పౌరులను స్వదేశానికి పంపాలని పాకిస్థాన్​ హైకమిషన్​ చేసిన అభ్యర్థనను అర్థం చేసుకున్నాం. వారిని పాక్​కు పంపడానికి సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాం."

-భారత విదేశాంగ శాఖ ప్రతినిధి

180 మంది పాక్​ పౌరులను గురువారం ఉదయం 10 గంటలకు అటారీ- వాఘా సరిహద్దు నుంచి పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో కూడా ఐదుగురు పాకిస్థానీయులు సురక్షితంగా వారి దేశానికి చేరుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది పాకిస్థానీయులు మెడికల్​ వీసా మీద భారత్​కు వస్తుంటారు.

అలాగే ఇతర దేశస్థులను కూడా వారి వారి దేశాలకు పంపటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.