ETV Bharat / bharat

పాక్​ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్​ నిరసన - ఉగ్రవాదుల చొరబాటు

నియంత్రిత రేఖ వెంబడి పాకిస్థాన్​ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై భారత్​ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలకు దాయాది సైన్యం సాయం చేయటంపై అభ్యంతరం తెలిపింది.

India conveys protest to Pak over unprovoked ceasefire violations along LoC, IB
పాక్​ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్​ నిరసన
author img

By

Published : Jul 3, 2020, 2:52 PM IST

పదే పదే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటంపై భారత్​ నిరసన వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్​ సైన్యం మద్దతు ఇవ్వటంపై తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.

భారత్​-పాకిస్థాన్​ 2003లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా.. ఈ ఏడాది జూన్​ వరకు దాయాది దేశం 2,432 సార్లు ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 14 మంది భారతీయులు మరణించగా.. 88 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. పాక్​ మాత్రం దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉందని తెలిపారు.

"నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ దళాలు నిరంతరాయంగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంపై మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం"

- అధికారుల ప్రకటన.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

పదే పదే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటంపై భారత్​ నిరసన వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్​ సైన్యం మద్దతు ఇవ్వటంపై తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.

భారత్​-పాకిస్థాన్​ 2003లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా.. ఈ ఏడాది జూన్​ వరకు దాయాది దేశం 2,432 సార్లు ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 14 మంది భారతీయులు మరణించగా.. 88 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. పాక్​ మాత్రం దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉందని తెలిపారు.

"నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ దళాలు నిరంతరాయంగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంపై మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం"

- అధికారుల ప్రకటన.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.