ETV Bharat / bharat

సరిహద్దు ఘర్షణపై చైనా రాయబారి శాంతి వచనాలు

author img

By

Published : Jun 25, 2020, 7:11 PM IST

Updated : Jun 25, 2020, 7:43 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే విధంగా భారత్​తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా పేర్కొంది. ఈ మేరకు భారత్​లోని చైనా రాయబారి సన్​ వైయ్​డాంగ్​ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదే సమయంలో ఉద్రిక్తతలకు భారత్​ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు.

Onus is not on China: says Chinese envoy Sun when asked how current Sino-India border dispute can be resolved.
'సమస్య పరిష్కారానికి భారత్​ కూడా సహకరించాలి'

సరిహద్దులో గత కొంతకాలంగా ఉద్రిక్తతలకు కారణమైన చైనా.. తాజాగా శాంతి మంత్రాన్ని జపిస్తున్నట్టు కనపడుతోంది. భారత్​తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సరైన విధానంలో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా పేర్కొంది. అనుమానాలు, ఘర్షణల వల్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరవని తెలిపింది.

తమ మధ్య ఉన్న విభేదాలను ఇరు దేశాలు సరిగ్గా అర్థం చేసుకోగలవని భారత్​లోని చైనా రాయబారి సన్​ వైయ్​డాంగ్​ అభిప్రాయపడ్డారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"శాంతి స్థాపనకు చైనా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. భారత్​ కూడా చైనాతో కలిసి ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా. ఉద్రిక్తతలను పెంచే విధంగా భారత్​ ఎలాంటి చర్యలు చేపట్టకుండా.. సరిహద్దులో పరిస్థితులు నిలకడగా ఉంచేందుకు కృషి చేయాలి. పరస్పరం గౌరవించుకుని, సహకరించుకుంటేనే దీర్ఘకాలంలో ఇరు దేశాలకు ప్రయోజనముంటుంది."

--- సన్​ వైయ్​డాంగ్​, భారత్​లోని చైనా రాయబారి.

'భారత్​దే తప్పు...'

సరిహద్దులో వివాదానికి తాము జవాబుదారులం కాదని.. భారత్​ వైఖరి వల్లే పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయని వైయ్​డాంగ్​ ఆరోపించారు. తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ ఘటనకు భారత్​ సైన్యమే కారణమన్నారు. భారత బలగాలే.. వాస్తవాధీన రేఖను దాటి ఇరు దేశాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రవర్తించాయని తెలిపారు.

ఇదీ జరిగింది...

వాస్తవాధీన రేఖ వెంబడి గత నెల నుంచి భారత్​పైకి కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఇదే క్రమంలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ నెల 6న ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరిగాయి. కానీ ఈ నెల 15న తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో అనూహ్యంగా భారత సైనికులపైకి దుస్సాహసానికి పాల్పడ్డారు చైనీయులు. 20మంది భారతీయులను పొట్టనబెట్టుకున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. వేడిని చల్లార్చడానికి మరోమారు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. సరిహద్దు వెంబడి సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసహరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఇదీ చూడండి:- చైనా దుర్నీతి- చర్చలు అంటూనే బలగాల మోహరింపు

సరిహద్దులో గత కొంతకాలంగా ఉద్రిక్తతలకు కారణమైన చైనా.. తాజాగా శాంతి మంత్రాన్ని జపిస్తున్నట్టు కనపడుతోంది. భారత్​తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సరైన విధానంలో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా పేర్కొంది. అనుమానాలు, ఘర్షణల వల్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరవని తెలిపింది.

తమ మధ్య ఉన్న విభేదాలను ఇరు దేశాలు సరిగ్గా అర్థం చేసుకోగలవని భారత్​లోని చైనా రాయబారి సన్​ వైయ్​డాంగ్​ అభిప్రాయపడ్డారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"శాంతి స్థాపనకు చైనా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. భారత్​ కూడా చైనాతో కలిసి ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా. ఉద్రిక్తతలను పెంచే విధంగా భారత్​ ఎలాంటి చర్యలు చేపట్టకుండా.. సరిహద్దులో పరిస్థితులు నిలకడగా ఉంచేందుకు కృషి చేయాలి. పరస్పరం గౌరవించుకుని, సహకరించుకుంటేనే దీర్ఘకాలంలో ఇరు దేశాలకు ప్రయోజనముంటుంది."

--- సన్​ వైయ్​డాంగ్​, భారత్​లోని చైనా రాయబారి.

'భారత్​దే తప్పు...'

సరిహద్దులో వివాదానికి తాము జవాబుదారులం కాదని.. భారత్​ వైఖరి వల్లే పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయని వైయ్​డాంగ్​ ఆరోపించారు. తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ ఘటనకు భారత్​ సైన్యమే కారణమన్నారు. భారత బలగాలే.. వాస్తవాధీన రేఖను దాటి ఇరు దేశాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రవర్తించాయని తెలిపారు.

ఇదీ జరిగింది...

వాస్తవాధీన రేఖ వెంబడి గత నెల నుంచి భారత్​పైకి కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఇదే క్రమంలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ నెల 6న ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరిగాయి. కానీ ఈ నెల 15న తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో అనూహ్యంగా భారత సైనికులపైకి దుస్సాహసానికి పాల్పడ్డారు చైనీయులు. 20మంది భారతీయులను పొట్టనబెట్టుకున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. వేడిని చల్లార్చడానికి మరోమారు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. సరిహద్దు వెంబడి సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసహరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఇదీ చూడండి:- చైనా దుర్నీతి- చర్చలు అంటూనే బలగాల మోహరింపు

Last Updated : Jun 25, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.