ETV Bharat / bharat

భారత్​ భేరి: అమిత్​షాపై నిలిచి గెలిచేనా..?

author img

By

Published : Apr 17, 2019, 6:22 AM IST

Updated : Apr 17, 2019, 1:01 PM IST

అధికార పక్షానికి కంచుకోట. 2 దశాబ్దాలుగా ఓటమే ఎరుగదు. ఈసారి పోటీకి దిగింది స్వయానా పార్టీ అధ్యక్షుడు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేదెలా? సుదీర్ఘ కసరత్తు తర్వాత కాంగ్రెస్​ అధినాయకత్వం ఈ ప్రశ్నకు ఓ సమాధానం కనుగొంది. గుజరాత్​ గాంధీనగర్​ స్థానం నుంచి ఎమ్మెల్యే సీజే చావ్డాను బరిలోకి దింపింది. ఈ వ్యూహం ఫలిస్తుందా? అమిత్​షాకు చావ్డా పోటీ ఇవ్వగలరా?

గాంధీనగర్​లో హోరాహోరి పోరు
గాంధీనగర్​లో అమిత్​షాపై

గాంధీనగర్.. గుజరాత్​లోని ఈ లోక్​సభ స్థానం భారతీయ జనతా పార్టీ కంచుకోట. అగ్రనేత లాల్​ కృష్ణ అడ్వాణీ సిట్టింగ్​ ఎంపీ. ఈ సార్వత్రిక ఎన్నికల వేళ లెక్క మారింది. 6 సార్లు గెలిచిన అడ్వాణీ స్థానంలో స్వయంగా భాజపా అధ్యక్షుడు అమిత్​షా బరిలో దిగారు. ఆయన్ను ఎదుర్కొని కాంగ్రెస్ విజేతగా నిలవగలదా అన్నదే ప్రశ్న.​

గాంధీనగర్​లో మొత్తం ఓటర్ల సంఖ్య- 19.21లక్షలు. గుజరాత్​లోని మొత్తం 26 లోక్​సభ సీట్లలో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్నది గాంధీనగర్​లోనే.

1991-2014 మధ్య జరిగిన ఎన్నికల్లో 1996 మినహా అన్నింటిలో అగ్రనేత అడ్వాణీ విజయం సాధించారు. 1996లో మాత్రం ఆయన స్థానంలో అటల్​ బిహారీ వాజ్​పేయీ పోటీ చేసి గెలిచారు.

గాంధీ నగర్​ పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 2017 శాసనసభ ఎన్నికల్లో 5 అర్బన్​ స్థానాలు భాజపావే. పాక్షిక గ్రామీణ నియోజకవర్గాలైన ఉత్తర గాంధీనగర్, కాలాల్​లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

అగ్రనేత స్థానంలో అధినేత...

గాంధీనగర్​కు వాజ్​పేయీ, అడ్వాణీ స్థానికేతరులు. అమిత్​షా ఇదే ప్రాంతానికి చెందినవారు. గతంలో షా గాంధీనగర్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలైన సర్ఖేజ్ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, నారన్​పుర ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొందారు. అడ్వాణీ గాంధీనగర్​లో పోటీచేసినప్పుడు అమిత్​షా 2009లో గాంధీనగర్​ లోక్​సభ నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేశారు. ఇవన్నీ అమిత్​కు సానుకూలాంశాలే.

"కాంగ్రెస్ ఇక్కడ పెద్ద విషయమే కాదు. ఇది భాజపా కంచుకోట. మేం అభివృద్ధి, సంక్షేమం రెండూ కల్పిస్తామని ప్రజలకు తెలుసు. ఇప్పటికే మేం చాలా అభివృద్ధి చేసి చూపించాం. ఇక్కడ కాంగ్రెస్​కు​ అభ్యర్థిని ఖరారు చేయకముందే ఓటమి ఖరారైంది. గాంధీనగర్​లో భాజపా అభ్యర్థి ఎవరైనా కచ్చితంగా గెలుస్తారు."

-భరత్​ పాండ్య, భాజపా అధికార ప్రతినిధి

విజయం కోసం అలుపెరగని పోరు...

గాంధీనగర్​లో విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్​. 1996లో వాజ్​పేయీ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికల్లో ప్రముఖ నటుడు రాజేశ్​ ఖన్నాను పోటీకి నిలిపింది. 1998 ఎన్నికల్లో గుజరాత్​ మాజీ డీజీపీ పీకే దత్తాకు టికెట్​ ఇచ్చింది. 1999లో ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి టీఎన్​ శేషన్​ను రంగంలోకి దింపింది. ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు.

అడ్వాణీ స్థానంలో అమిత్​ షా రాకతో కాంగ్రెస్​ కొత్త లెక్కలు వేసుకుంది. గాంధీనగర్​లో బలమైన అభ్యర్థిని నిలబెడితే భాజపా అధ్యక్షుడికి గట్టి పోటీ ఇవ్వవచ్చన్న రాజకీయ విశ్లేషకుల మాట కాంగ్రెస్​ను ఆలోచింపచేసింది. అందుకే అభ్యర్థి ఎంపికపై విస్తృత కసరత్తు చేసింది. పాటీదార్​ ఉద్యమనేత హార్దిక్​ పటేల్​ను రంగంలోకి దింపడంపైనా తర్జనభర్జన పడింది. ఆయన్ను పోటీకి నిలిపితే... 2017 శాసనసభ ఎన్నికల్లో భాజపాకు పడిన పటేళ్ల ఓట్లు ఈసారి తమకు మళ్లుతాయని ఆశపడింది. కానీ సాధ్యపడలేదు. ఓ కేసులో దోషిగా తేలిన హార్దిక్​... పోటీకి అనర్హుడయ్యారు.

పటేల్​ కాదు ఠాకూర్​...

అమిత్​షాను ఎదుర్కొనేందుకు ఉత్తర గాంధీనగర్​ ఎమ్మెల్యే సీజే చావ్డాను రంగంలోకి దింపింది కాంగ్రెస్​. ఆయన స్థానికుడు, రెండు సార్లు శాసనసభ్యుడు, ఠాకూర్​ వర్గం నేత. ఆ సామాజిక వర్గం మద్దతు ఎప్పుడూ కాంగ్రెస్​కే.

ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన అమిత్​షాను చావ్డా ఎదుర్కోగలరా అన్నదే అసలు ప్రశ్న.

"ఈ పోటీ చావ్డాకు, అమిత్​షాకు మధ్య అనొద్దు. ఈ ఎన్నికలు కాంగ్రెస్​, భాజపా మధ్య పోటీ. అమిత్​ షా భాజపా అధ్యక్షుడిగా ఉండి సురక్షిత స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? గట్టి సవాలు ఎదురయ్యే చోట నిలబడాల్సింది కదా. ఇటీవలే కాంగ్రెస్ ముఖ్య నేతలు గాంధీనగర్​లో చేసిన మెగా ర్యాలీలో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు. లక్షలాది మంది హాజరయ్యారు. దాన్ని బట్టే తెలుస్తోంది భాజపాకు గుజరాత్​లో విజయం అనుకున్నంత సులువుగా లేదని. భాజపాకు మేం గట్టి పోటీనిస్తాం."

-సీజే చావ్డా, గాంధీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి

అడ్వాణీ విజయపరంపరను అమిత్​షా కొనసాగిస్తారా? సీజే చావ్డా సరికొత్త చరిత్ర లిఖిస్తారా అనేది మే 23న తేలనుంది.

ఇదీ చూడండి: భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'

గాంధీనగర్​లో అమిత్​షాపై

గాంధీనగర్.. గుజరాత్​లోని ఈ లోక్​సభ స్థానం భారతీయ జనతా పార్టీ కంచుకోట. అగ్రనేత లాల్​ కృష్ణ అడ్వాణీ సిట్టింగ్​ ఎంపీ. ఈ సార్వత్రిక ఎన్నికల వేళ లెక్క మారింది. 6 సార్లు గెలిచిన అడ్వాణీ స్థానంలో స్వయంగా భాజపా అధ్యక్షుడు అమిత్​షా బరిలో దిగారు. ఆయన్ను ఎదుర్కొని కాంగ్రెస్ విజేతగా నిలవగలదా అన్నదే ప్రశ్న.​

గాంధీనగర్​లో మొత్తం ఓటర్ల సంఖ్య- 19.21లక్షలు. గుజరాత్​లోని మొత్తం 26 లోక్​సభ సీట్లలో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్నది గాంధీనగర్​లోనే.

1991-2014 మధ్య జరిగిన ఎన్నికల్లో 1996 మినహా అన్నింటిలో అగ్రనేత అడ్వాణీ విజయం సాధించారు. 1996లో మాత్రం ఆయన స్థానంలో అటల్​ బిహారీ వాజ్​పేయీ పోటీ చేసి గెలిచారు.

గాంధీ నగర్​ పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 2017 శాసనసభ ఎన్నికల్లో 5 అర్బన్​ స్థానాలు భాజపావే. పాక్షిక గ్రామీణ నియోజకవర్గాలైన ఉత్తర గాంధీనగర్, కాలాల్​లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

అగ్రనేత స్థానంలో అధినేత...

గాంధీనగర్​కు వాజ్​పేయీ, అడ్వాణీ స్థానికేతరులు. అమిత్​షా ఇదే ప్రాంతానికి చెందినవారు. గతంలో షా గాంధీనగర్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలైన సర్ఖేజ్ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, నారన్​పుర ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొందారు. అడ్వాణీ గాంధీనగర్​లో పోటీచేసినప్పుడు అమిత్​షా 2009లో గాంధీనగర్​ లోక్​సభ నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేశారు. ఇవన్నీ అమిత్​కు సానుకూలాంశాలే.

"కాంగ్రెస్ ఇక్కడ పెద్ద విషయమే కాదు. ఇది భాజపా కంచుకోట. మేం అభివృద్ధి, సంక్షేమం రెండూ కల్పిస్తామని ప్రజలకు తెలుసు. ఇప్పటికే మేం చాలా అభివృద్ధి చేసి చూపించాం. ఇక్కడ కాంగ్రెస్​కు​ అభ్యర్థిని ఖరారు చేయకముందే ఓటమి ఖరారైంది. గాంధీనగర్​లో భాజపా అభ్యర్థి ఎవరైనా కచ్చితంగా గెలుస్తారు."

-భరత్​ పాండ్య, భాజపా అధికార ప్రతినిధి

విజయం కోసం అలుపెరగని పోరు...

గాంధీనగర్​లో విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్​. 1996లో వాజ్​పేయీ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికల్లో ప్రముఖ నటుడు రాజేశ్​ ఖన్నాను పోటీకి నిలిపింది. 1998 ఎన్నికల్లో గుజరాత్​ మాజీ డీజీపీ పీకే దత్తాకు టికెట్​ ఇచ్చింది. 1999లో ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి టీఎన్​ శేషన్​ను రంగంలోకి దింపింది. ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు.

అడ్వాణీ స్థానంలో అమిత్​ షా రాకతో కాంగ్రెస్​ కొత్త లెక్కలు వేసుకుంది. గాంధీనగర్​లో బలమైన అభ్యర్థిని నిలబెడితే భాజపా అధ్యక్షుడికి గట్టి పోటీ ఇవ్వవచ్చన్న రాజకీయ విశ్లేషకుల మాట కాంగ్రెస్​ను ఆలోచింపచేసింది. అందుకే అభ్యర్థి ఎంపికపై విస్తృత కసరత్తు చేసింది. పాటీదార్​ ఉద్యమనేత హార్దిక్​ పటేల్​ను రంగంలోకి దింపడంపైనా తర్జనభర్జన పడింది. ఆయన్ను పోటీకి నిలిపితే... 2017 శాసనసభ ఎన్నికల్లో భాజపాకు పడిన పటేళ్ల ఓట్లు ఈసారి తమకు మళ్లుతాయని ఆశపడింది. కానీ సాధ్యపడలేదు. ఓ కేసులో దోషిగా తేలిన హార్దిక్​... పోటీకి అనర్హుడయ్యారు.

పటేల్​ కాదు ఠాకూర్​...

అమిత్​షాను ఎదుర్కొనేందుకు ఉత్తర గాంధీనగర్​ ఎమ్మెల్యే సీజే చావ్డాను రంగంలోకి దింపింది కాంగ్రెస్​. ఆయన స్థానికుడు, రెండు సార్లు శాసనసభ్యుడు, ఠాకూర్​ వర్గం నేత. ఆ సామాజిక వర్గం మద్దతు ఎప్పుడూ కాంగ్రెస్​కే.

ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన అమిత్​షాను చావ్డా ఎదుర్కోగలరా అన్నదే అసలు ప్రశ్న.

"ఈ పోటీ చావ్డాకు, అమిత్​షాకు మధ్య అనొద్దు. ఈ ఎన్నికలు కాంగ్రెస్​, భాజపా మధ్య పోటీ. అమిత్​ షా భాజపా అధ్యక్షుడిగా ఉండి సురక్షిత స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? గట్టి సవాలు ఎదురయ్యే చోట నిలబడాల్సింది కదా. ఇటీవలే కాంగ్రెస్ ముఖ్య నేతలు గాంధీనగర్​లో చేసిన మెగా ర్యాలీలో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు. లక్షలాది మంది హాజరయ్యారు. దాన్ని బట్టే తెలుస్తోంది భాజపాకు గుజరాత్​లో విజయం అనుకున్నంత సులువుగా లేదని. భాజపాకు మేం గట్టి పోటీనిస్తాం."

-సీజే చావ్డా, గాంధీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి

అడ్వాణీ విజయపరంపరను అమిత్​షా కొనసాగిస్తారా? సీజే చావ్డా సరికొత్త చరిత్ర లిఖిస్తారా అనేది మే 23న తేలనుంది.

ఇదీ చూడండి: భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'

RESTRICTION SUMMARY: NO ACCESS FRANCE/48 HOURS NEWS ACCESS ONLY/NO ARCHIVE
SHOTLIST:   
FRANCE TELEVISIONS - NO ACCESS FRANCE; 48 HOURS NEWS ACCESS ONLY; NO ARCHIVE
Paris - 15 April 2019
1. Various of damage inside Notre Dame Cathedral by the choir area
2. Various of debris inside cathedral
3. Various of firefighters spraying water on smouldering ashes
4. Various of hole on ceiling where spire collapsed
5. Red embers falling from the roof inside cathedral
STORYLINE:
Video from Monday night shows firefighters surveying the damage inside Paris' fire-ravaged Notre Dame Cathedral
A blaze swept across the top of the soaring Paris landmark, collapsing its spire as locals and tourists watched aghast from the streets.
In the interior footage, smouldering ashes can be seen, along with red embers falling from the roof.
Firefighters declared success Tuesday morning in their more than 12-hour battle to extinguish the flames that engulfed the iconic Notre Dame cathedral.
What remained was a blackened shell of the monument immortalized in Victor Hugo's 1831 novel "The Hunchback of Notre Dame," a building that had survived almost 900 years of tumultuous French history.
The two iconic 69-metre (226 feet) bell towers remained intact and swarmed with building specialists and architects at dawn, looking tiny from the ground as they conducted analysis. The cathedral's spire and roof were gone, however.
Paris firefighters said "the entire fire is out" and that emergency services are currently "surveying the movement of the structures and extinguishing smoldering residues".
Officials consider the fire an accident, possibly as a result of restoration work taking place at the global architectural treasure, but that news has done nothing to ease the national mourning.
French President Emmanuel Macron pledged to rebuild the cathedral that he called "a part of us" and appealed for help to do so.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 17, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.