ETV Bharat / bharat

కరోనా ఉన్నా ఆ రాష్ట్రంలో విద్యా సంవత్సరం షురూ! - ఆన్​లైన్​ తరగతులు

కరోనా సంక్షోభంలో విద్యార్థులు వారి అమూల్యమైన సమయాన్ని నష్టపోకుండా కేరళ పక్కా ప్రణాళికతో ముందుకొచ్చింది. దేశంలో తొలిసారిగా.. 1 నుంచి 12 క్లాసుల విద్యార్థుల కోసం ఆన్​లైన్​ తరగతులను సోమవారం ప్రారంభించింది. దీనితో 45లక్షలమంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. ఇందుకోసం రాష్ట్ర అధికారిక ఛానెల్​ను ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం.

In a first, Kerala schools' new academic year begins online
ఇక టీవీలోనే విద్యా బోధన.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక
author img

By

Published : Jun 1, 2020, 7:19 PM IST

కరోనా లాక్​డౌన్​తో విద్యా వ్యవస్థ కుదేలైంది. విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు చెప్పాలోనని అన్ని ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతుంటే.. కేరళ మాత్రం నూతన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేసింది. ఇందుకోసం అంతర్జాలాన్ని వేదికగా చేసుకుంది.

కేరళ అధికారిక ఛానెల్​ కైట్​-విక్టర్​లో 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు మొదలయ్యాయి. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఈ ప్రక్రియను ప్రారంభించారు. దీనితో 45 లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇలా పూర్తిస్థాయిలో ఆన్​లైన్​లో పాఠాలు చెప్పడం దేశంలో ఇదే తొలిసారి.

ఒక్కో తరగతికి ఒక్కో టైమ్​ స్లాట్​ ఉంటుందని, సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పవర్​ కట్​తో సతమతమయ్యే విద్యార్థుల కోసం.. కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేస్తారు. ఇవి యూట్యూబ్​లో కూడా అందుబాటులో ఉంటాయి.

"వెబ్​, బ్రాడ్​కాస్ట్​, ఆఫ్​లైన్​లోనూ తరగతులను నిర్వహిస్తోంది కైట్​-విక్టర్​. ప్రతి క్లాసు కోసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారు. వీరిలో ఒకరు 30 నిమిషాల పాటు క్లాస్​ చెప్తారు. విద్యార్థులు ఆ క్లాస్​ను చూస్తారు. రాత్రికి విద్యార్థులను టీచర్లు మొబైల్​ ఫోన్ల ద్వారా సంప్రదిస్తారు. వారి ఫీడ్​బ్యాక్​ను తీసుకుంటారు. విద్యార్థుల సందేహాలను తీర్చే బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులదే."

--- అన్వర్​ సదాత్​, కైట్​ వైస్​ ఛైర్మన్​.

ఈ ప్రాజెక్ట్​పై గత కొంతకాలంగా పని చేస్తున్నట్టు కైట్​(కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ అండ్​ టెక్నాలజీ ఫర్​ ఎడ్యుకేషన్​) తెలిపింది.

12వ తరగతి కోసం నాలుగు, 10వ తరగతి కోసం 3, 8-9 తరగతుల కోసం రెండు, మిగిలిన తరగతులకు ఒక్కో పీరియడ్​ను కేటాయించింది ప్రభుత్వం. ఒక్కో తరగతి వ్యవధి 30 నిమిషాలు.

పక్కా ప్రణాళికతో...

ఈ ఆన్​లైన్​ తరగతులను అమలు చేయడానికి పక్కా ప్రణాళికలు రచించింది ప్రభుత్వం. టీవీలు, స్మార్ట్​ఫోన్​లు లేనివారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

"రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1.20లక్షల ల్యాప్​టాప్​లు, 80వేల ప్రొజెక్టర్లు, 4,500 టీవీలు ఉన్నాయి. టీవీ సదుపాయం లేని విద్యార్థులను ఇప్పటికే గుర్తించారు. ఒకే చోట ఉండే 5-10 విద్యార్థుల కోసం ఆయా ప్రదేశాల్లో టీవీలు ఏర్పాటు చేశాం. భౌతిక దూరం పాటించేలా కఠిన నిబంధనలను అముల చేశాం."

--- కైట్​ అధికారి.

అయితే ఈ ఆన్​లైన్​ తరగతులు తాత్కాలికమే అని, పరిస్థితులు కుదుటపడ్డాక.. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిందేనని కేరళ విద్యాశాఖ మంత్రి సి. రవీంద్రనాథ్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- పదవీ విరమణ రోజున కార్యాలయంలోనే డీజీపీ నిద్ర

కరోనా లాక్​డౌన్​తో విద్యా వ్యవస్థ కుదేలైంది. విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు చెప్పాలోనని అన్ని ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతుంటే.. కేరళ మాత్రం నూతన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేసింది. ఇందుకోసం అంతర్జాలాన్ని వేదికగా చేసుకుంది.

కేరళ అధికారిక ఛానెల్​ కైట్​-విక్టర్​లో 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు మొదలయ్యాయి. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఈ ప్రక్రియను ప్రారంభించారు. దీనితో 45 లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇలా పూర్తిస్థాయిలో ఆన్​లైన్​లో పాఠాలు చెప్పడం దేశంలో ఇదే తొలిసారి.

ఒక్కో తరగతికి ఒక్కో టైమ్​ స్లాట్​ ఉంటుందని, సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పవర్​ కట్​తో సతమతమయ్యే విద్యార్థుల కోసం.. కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేస్తారు. ఇవి యూట్యూబ్​లో కూడా అందుబాటులో ఉంటాయి.

"వెబ్​, బ్రాడ్​కాస్ట్​, ఆఫ్​లైన్​లోనూ తరగతులను నిర్వహిస్తోంది కైట్​-విక్టర్​. ప్రతి క్లాసు కోసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారు. వీరిలో ఒకరు 30 నిమిషాల పాటు క్లాస్​ చెప్తారు. విద్యార్థులు ఆ క్లాస్​ను చూస్తారు. రాత్రికి విద్యార్థులను టీచర్లు మొబైల్​ ఫోన్ల ద్వారా సంప్రదిస్తారు. వారి ఫీడ్​బ్యాక్​ను తీసుకుంటారు. విద్యార్థుల సందేహాలను తీర్చే బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులదే."

--- అన్వర్​ సదాత్​, కైట్​ వైస్​ ఛైర్మన్​.

ఈ ప్రాజెక్ట్​పై గత కొంతకాలంగా పని చేస్తున్నట్టు కైట్​(కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ అండ్​ టెక్నాలజీ ఫర్​ ఎడ్యుకేషన్​) తెలిపింది.

12వ తరగతి కోసం నాలుగు, 10వ తరగతి కోసం 3, 8-9 తరగతుల కోసం రెండు, మిగిలిన తరగతులకు ఒక్కో పీరియడ్​ను కేటాయించింది ప్రభుత్వం. ఒక్కో తరగతి వ్యవధి 30 నిమిషాలు.

పక్కా ప్రణాళికతో...

ఈ ఆన్​లైన్​ తరగతులను అమలు చేయడానికి పక్కా ప్రణాళికలు రచించింది ప్రభుత్వం. టీవీలు, స్మార్ట్​ఫోన్​లు లేనివారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

"రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1.20లక్షల ల్యాప్​టాప్​లు, 80వేల ప్రొజెక్టర్లు, 4,500 టీవీలు ఉన్నాయి. టీవీ సదుపాయం లేని విద్యార్థులను ఇప్పటికే గుర్తించారు. ఒకే చోట ఉండే 5-10 విద్యార్థుల కోసం ఆయా ప్రదేశాల్లో టీవీలు ఏర్పాటు చేశాం. భౌతిక దూరం పాటించేలా కఠిన నిబంధనలను అముల చేశాం."

--- కైట్​ అధికారి.

అయితే ఈ ఆన్​లైన్​ తరగతులు తాత్కాలికమే అని, పరిస్థితులు కుదుటపడ్డాక.. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిందేనని కేరళ విద్యాశాఖ మంత్రి సి. రవీంద్రనాథ్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- పదవీ విరమణ రోజున కార్యాలయంలోనే డీజీపీ నిద్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.