ETV Bharat / bharat

విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు

author img

By

Published : Aug 8, 2020, 11:29 AM IST

Updated : Aug 8, 2020, 12:40 PM IST

కోజికోడ్​లో విమాన ప్రమాదం నేపథ్యంలో అక్కడ నెలకొన్న భీతావహ వాతావరణం గురించి స్థానికులు వెల్లడించారు. అర్తనాదాలు, అంబులెన్సుల సైరన్లు, రక్తంతో తడిసిన ప్రయాణికులు, భయంతో వణికిన చిన్నారులను సంఘటనా స్థలంలో చూసినట్లు వివరించారు. భారీ వర్షం కురుస్తుండగానే సహాయక బృందాలు, స్థానిక పోలీసులు రక్షణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

kozhikode plane crash
విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు

ప్రయాణికుల ఆర్తనాదాలు.. అంబులెన్సుల సైరన్లు, మరోవైపు రక్తంతో తడిసిన బట్టలు.. భయంతో వణికిన చిన్నారులు.. ఇవీ నిన్న రాత్రి కోజికోడ్‌ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సమయంలో చోటుచుసుకున్న భయానక దృశ్యాలు.

దుబాయి‌ నుంచి కోజికోడ్‌కు చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై జారిపడటంతో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19మంది మరణించగా.. 100 మందికిపైగా గాయపడ్డారు. నిన్న రాత్రి అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలను స్థానికులు వివరించారు.

ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగానే సహాయక బృందాలు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. రెండుగా విరిగిపోయిన విమాన శకలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ క్షణం ఏం జరిగిందో తెలియని ఆందోళన. ఆ భయానక క్షణాల్లో వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అంతేకాకుండా నాలుగైదేళ్ల చిన్నారులు, ప్రయాణికులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు సరైన సమయానికి అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.

రక్తంతో తడిసిపోయాను..

విమాన ప్రమాదం సమయంలో అక్కడ ఉన్న పరిస్థితిపై ఓ స్థానికుడు ఇలా వెల్లడించాడు.

"భయంకరమైన శబ్దం విని నేను అక్కడికి పరుగులు తీశాను. చిన్నారులు కొందరు సీట్ల కింద ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ ప్రాంతమంతా దుఖఃసంద్రంగా మారింది. మేం అక్కడికి వెళ్లేసరికే కొందరు కింద పడిపోయి ఉన్నారు. చాలా మంది గాయపడ్డారు. కొందరి కాళ్లు విరిగాయి. నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి." అని వివరించాడు.

కాక్‌పిట్‌ విరగ్గొట్టి పైలట్‌ను బయటకు తీశారు..

kozhikode plane crash
విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు

గాయపడిన పైలట్‌ను కాక్‌పిట్‌ విరగ్గొట్టిన తర్వాత బయటకు తీశారని మరో వ్యక్తి తెలిపాడు. అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొనేటప్పటికే కొందరు స్థానికులు కార్లు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లారని వివరించాడు.

ప్రయాణికుల ఆర్తనాదాలు.. అంబులెన్సుల సైరన్లు, మరోవైపు రక్తంతో తడిసిన బట్టలు.. భయంతో వణికిన చిన్నారులు.. ఇవీ నిన్న రాత్రి కోజికోడ్‌ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సమయంలో చోటుచుసుకున్న భయానక దృశ్యాలు.

దుబాయి‌ నుంచి కోజికోడ్‌కు చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై జారిపడటంతో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19మంది మరణించగా.. 100 మందికిపైగా గాయపడ్డారు. నిన్న రాత్రి అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలను స్థానికులు వివరించారు.

ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగానే సహాయక బృందాలు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. రెండుగా విరిగిపోయిన విమాన శకలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ క్షణం ఏం జరిగిందో తెలియని ఆందోళన. ఆ భయానక క్షణాల్లో వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అంతేకాకుండా నాలుగైదేళ్ల చిన్నారులు, ప్రయాణికులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు సరైన సమయానికి అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.

రక్తంతో తడిసిపోయాను..

విమాన ప్రమాదం సమయంలో అక్కడ ఉన్న పరిస్థితిపై ఓ స్థానికుడు ఇలా వెల్లడించాడు.

"భయంకరమైన శబ్దం విని నేను అక్కడికి పరుగులు తీశాను. చిన్నారులు కొందరు సీట్ల కింద ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ ప్రాంతమంతా దుఖఃసంద్రంగా మారింది. మేం అక్కడికి వెళ్లేసరికే కొందరు కింద పడిపోయి ఉన్నారు. చాలా మంది గాయపడ్డారు. కొందరి కాళ్లు విరిగాయి. నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి." అని వివరించాడు.

కాక్‌పిట్‌ విరగ్గొట్టి పైలట్‌ను బయటకు తీశారు..

kozhikode plane crash
విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు

గాయపడిన పైలట్‌ను కాక్‌పిట్‌ విరగ్గొట్టిన తర్వాత బయటకు తీశారని మరో వ్యక్తి తెలిపాడు. అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొనేటప్పటికే కొందరు స్థానికులు కార్లు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లారని వివరించాడు.

Last Updated : Aug 8, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.