ETV Bharat / bharat

'నిసర్గ'పై అమిత్​ షా సమీక్ష.. ఆ రాష్ట్రాలకు హామీ

author img

By

Published : Jun 1, 2020, 10:58 PM IST

మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాలపై మరికొద్ది రోజుల్లో 'నిసర్గ' తుపాను విరుచుకుపడనుంది. ఈ నేపథ్యంలో విపత్తును ఎదుర్కోవడానికి చేపడుతున్న ముందుస్తు చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్షించారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు షా.

HM Amit Shah assures Rupani, Thackeray help to deal with cyclone; reviews preparations
ఆ రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తుంది: అమిత్​ షా

భారత్​కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఇటీవలే అంపన్​ తుపాను బంగాల్​ను అతలాకుతలం చేసింది. తాజాగా 'నిసర్గ' తుపాను గుజరాత్​, మహారాష్ట్రలను గడగడలాడించేందుకు సిద్ధమవుతున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో విపత్తును ఎదుర్కోవడానికి చేపడుతున్న ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి.. కేంద్రం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీనిచ్చారు షా.

  • Union Home Minister @AmitShah held review meeting with senior officials of NDMA, NDRF, IMD & Indian Coast Guard on preparedness for dealing with Cyclone brewing in Arabian sea which is expected to hit some parts of Maharashtra & Gujarat. MoS @nityanandraibjp was also present. pic.twitter.com/qxmeKkUUqt

    — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వీడియో కాన్ఫరెన్స్​లో..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్​ ఠాక్రే, గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, కేంద్రపాలిత ప్రాంతం డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలి పాలకుడు ప్రఫుల్​ పటేల్​లతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు అమిత్​ షా. ఈ నేపథ్యంలో తుపానును ఎదుర్కోవడానికి కావాల్సిన వనరులపై వివరించమని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగారు షా.

31 బృందాలు..

ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్​, డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలిల్లో 31 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను(ఎన్​డీఎంఏ) మోహరించినట్లు హోంమంత్రిత్వశాఖ తెలిపింది. 13 బృందాలను గుజరాత్​లో, 16బృందాలు మహారాష్ట్రలో, మిగిలిన 2 బృందాలను డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలిలో మోహరించినట్లు వివరించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్​డీఎంఏ సిబ్బంది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇటీవల అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. ఇది భీకర తుపానుగా మారనున్నట్లు తెలిపారు. 'నిసర్గ'గా పిలుస్తోన్న ఈ తుపాను ఈ నెల 3వ తేదీ సాయంత్రానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర మధ్య తీరాన్ని తాకవచ్చని వారు తెలిపారు.

ఇదీ చూడండి: రెండు రోజుల్లో దేశానికి మరో తుపాను ముప్పు..!

భారత్​కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఇటీవలే అంపన్​ తుపాను బంగాల్​ను అతలాకుతలం చేసింది. తాజాగా 'నిసర్గ' తుపాను గుజరాత్​, మహారాష్ట్రలను గడగడలాడించేందుకు సిద్ధమవుతున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో విపత్తును ఎదుర్కోవడానికి చేపడుతున్న ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి.. కేంద్రం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీనిచ్చారు షా.

  • Union Home Minister @AmitShah held review meeting with senior officials of NDMA, NDRF, IMD & Indian Coast Guard on preparedness for dealing with Cyclone brewing in Arabian sea which is expected to hit some parts of Maharashtra & Gujarat. MoS @nityanandraibjp was also present. pic.twitter.com/qxmeKkUUqt

    — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వీడియో కాన్ఫరెన్స్​లో..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్​ ఠాక్రే, గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, కేంద్రపాలిత ప్రాంతం డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలి పాలకుడు ప్రఫుల్​ పటేల్​లతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు అమిత్​ షా. ఈ నేపథ్యంలో తుపానును ఎదుర్కోవడానికి కావాల్సిన వనరులపై వివరించమని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగారు షా.

31 బృందాలు..

ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్​, డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలిల్లో 31 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను(ఎన్​డీఎంఏ) మోహరించినట్లు హోంమంత్రిత్వశాఖ తెలిపింది. 13 బృందాలను గుజరాత్​లో, 16బృందాలు మహారాష్ట్రలో, మిగిలిన 2 బృందాలను డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలిలో మోహరించినట్లు వివరించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్​డీఎంఏ సిబ్బంది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇటీవల అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. ఇది భీకర తుపానుగా మారనున్నట్లు తెలిపారు. 'నిసర్గ'గా పిలుస్తోన్న ఈ తుపాను ఈ నెల 3వ తేదీ సాయంత్రానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర మధ్య తీరాన్ని తాకవచ్చని వారు తెలిపారు.

ఇదీ చూడండి: రెండు రోజుల్లో దేశానికి మరో తుపాను ముప్పు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.