బంగాల్లో మత సామరస్యానిక ప్రతీకగా నిలిచే ఘటన ఒకటి జరిగింది. చిరులియా గ్రామంలో హిందు మతానికి చెందిన రామ్ధను రజాక్ అనే వ్యక్తి అంతిమ సంస్కారాలను స్థానికంగా ఉండే ముస్లింలు నిర్వహించారు. ఈ గ్రామం ప్రముఖ కవి అయిన కాజీ నజ్రూల్ ఇస్లామ్ జన్మస్థలం. నజ్రూల్ ముఖ్యంగా మత సామరస్యం పరమళించే కవిత్వంతో ఆకట్టుకుంటే గ్రామస్థులు మాత్రం చేతల్లో చేసి చూపిస్తున్నారు.
మరణించిన రామ్ధను రజాక్ కు ఇద్దరు కూమారులు. వారిలో ఒకరు స్థానికంగా లేరు. మరొకరు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అన్నీ తామై ముస్లింలు అంతిమ సంస్కారాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.
ఇదీ చూడండి: మోదీ 'టీకా టూర్'పై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు