ETV Bharat / bharat

అధికారులు అప్రమత్తం.. షహీన్​బాగ్​లో భారీ భద్రత

author img

By

Published : Mar 1, 2020, 1:40 PM IST

Updated : Mar 3, 2020, 1:31 AM IST

దిల్లీలో మరోమారు హింసాత్మక ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. షహీన్​బాగ్​లో చేపట్టిన నిరసనలు.. మార్చి 1 నాటికి విరమించుకోవాలని హిందూసేన హెచ్చరించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించారు.

Heavy police deployment in Shaheen Bagh as precautionary measure
దిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు

ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల-ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారి 43 మంది మృతిచెందారు. మరోమారు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. అందులో భాగంగా.. షహీన్​బాగ్​ ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు.

పౌర చట్టానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఈశాన్య దిల్లీ, షహీన్​బాగ్​ ప్రాంతాల్లో పలువురు మహిళలు నిరసన చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు మార్చి 1 నాటికి నిరనలనలు ఆపేయాలని హిందూసేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్​ విధించినట్టు పోస్టర్లు దర్శనమిచ్చాయి.

అధికారుల అప్రమత్తం.. షహీన్​బాగ్​లో భారీ భద్రత

సకాలంలో పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులు ఆందోళనలను విరమించేలా చేశారని ఈశాన్య దిల్లీ పోలీస్​ కమిషనర్​ ఆర్​పీ మీనా తెలిపారు. అయినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా భారీ సిబ్బందిని మోహరించామని చెప్పారు.

ఇదీ చదవండి: నితీశ్ ​కుమార్​ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ.!

ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల-ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారి 43 మంది మృతిచెందారు. మరోమారు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. అందులో భాగంగా.. షహీన్​బాగ్​ ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు.

పౌర చట్టానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఈశాన్య దిల్లీ, షహీన్​బాగ్​ ప్రాంతాల్లో పలువురు మహిళలు నిరసన చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు మార్చి 1 నాటికి నిరనలనలు ఆపేయాలని హిందూసేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్​ విధించినట్టు పోస్టర్లు దర్శనమిచ్చాయి.

అధికారుల అప్రమత్తం.. షహీన్​బాగ్​లో భారీ భద్రత

సకాలంలో పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులు ఆందోళనలను విరమించేలా చేశారని ఈశాన్య దిల్లీ పోలీస్​ కమిషనర్​ ఆర్​పీ మీనా తెలిపారు. అయినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా భారీ సిబ్బందిని మోహరించామని చెప్పారు.

ఇదీ చదవండి: నితీశ్ ​కుమార్​ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ.!

Last Updated : Mar 3, 2020, 1:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.