ETV Bharat / bharat

'హాథ్రస్​' ఘర్షణల కోసం విదేశాల నుంచి రూ.100 కోట్లు!

author img

By

Published : Oct 7, 2020, 4:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో హాథ్రస్​ ఘటన ఆధారంగా కుల ఘర్షణలను ప్రేరేపించేందుకు విదేశాల నుంచి రూ.100 కోట్లు వచ్చినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మారిషస్​ నుంచే 50 కోట్ల రూపాయలు అందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.

HATHRAS ED
ఈడీ

హాథ్రస్​ ఘటనపై హింస రాజేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఘర్షణలను ప్రేరేపించటానికి రూ.100 కోట్లు విదేశీ సంస్థలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.50 కోట్లు ఒక్క మారిషస్​ నుంచే వచ్చినట్లు ఈడీ గుర్తించింది.

రాష్ట్రంలో హాథ్రస్​ ఘటనను ఆధారంగా చేసుకుని కుల ఘర్షణలు ఉసిగొల్పేలా విదేశాల నుంచి కుట్ర జరుగుతోందని యోగి ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశీ నిధులు అందాయన్న అనుమానాలతో 'జస్టిస్​ ఫర్ హాథ్రస్​ విక్టిమ్​' అనే వెబ్​సైట్​పై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది.

వెబ్​సైట్​పై విచారణ..

ఈ కుట్రకు సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసును త్వరలోనే నమోదు చేయనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంతో సంబంధమున్న వాళ్లను అరెస్టు చేసి, విచారించనున్నట్లు స్పష్టం చేశాయి. ఈ వెబ్​సైట్​కు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను పరిశీలిస్తున్నట్లు ఈడీ జాయింట్ డైరెక్టర్​ రాజేశ్వర్​ సింగ్ తెలిపారు.

ఈ వెబ్​సైట్​ను అమెరికా ఆధారిత సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. వెబ్​సైట్ డొమైన్​ను కొనుగోలు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు 'కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్​ ఆఫ్ ఇండియా' సాయాన్ని ఈడీ కోరనున్నట్లు సమాచారం.

యూపీ పోలీసుల దర్యాప్తు..

హాథ్రస్​ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ప్రకటనలు, నిజాలను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని యూపీ పోలీసులు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్ని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపారు. కుల, మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి 19మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: కుల ఘర్షణలకు కుట్ర! హాథ్రస్ ఘటనపై 19 కేసులు

హాథ్రస్​ ఘటనపై హింస రాజేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఘర్షణలను ప్రేరేపించటానికి రూ.100 కోట్లు విదేశీ సంస్థలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.50 కోట్లు ఒక్క మారిషస్​ నుంచే వచ్చినట్లు ఈడీ గుర్తించింది.

రాష్ట్రంలో హాథ్రస్​ ఘటనను ఆధారంగా చేసుకుని కుల ఘర్షణలు ఉసిగొల్పేలా విదేశాల నుంచి కుట్ర జరుగుతోందని యోగి ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశీ నిధులు అందాయన్న అనుమానాలతో 'జస్టిస్​ ఫర్ హాథ్రస్​ విక్టిమ్​' అనే వెబ్​సైట్​పై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది.

వెబ్​సైట్​పై విచారణ..

ఈ కుట్రకు సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసును త్వరలోనే నమోదు చేయనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంతో సంబంధమున్న వాళ్లను అరెస్టు చేసి, విచారించనున్నట్లు స్పష్టం చేశాయి. ఈ వెబ్​సైట్​కు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను పరిశీలిస్తున్నట్లు ఈడీ జాయింట్ డైరెక్టర్​ రాజేశ్వర్​ సింగ్ తెలిపారు.

ఈ వెబ్​సైట్​ను అమెరికా ఆధారిత సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. వెబ్​సైట్ డొమైన్​ను కొనుగోలు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు 'కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్​ ఆఫ్ ఇండియా' సాయాన్ని ఈడీ కోరనున్నట్లు సమాచారం.

యూపీ పోలీసుల దర్యాప్తు..

హాథ్రస్​ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ప్రకటనలు, నిజాలను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని యూపీ పోలీసులు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్ని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపారు. కుల, మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి 19మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: కుల ఘర్షణలకు కుట్ర! హాథ్రస్ ఘటనపై 19 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.