ETV Bharat / bharat

మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ భద్రతను జెడ్​ ప్లస్​ విభాగానికి మార్చింది కేంద్ర ప్రభుత్వం. మాజీ ప్రధానికి ఇన్నేళ్లుగా ఉన్న ఎస్​పీజీ రక్షణను ఉపసంహరించుకుంది.

author img

By

Published : Aug 26, 2019, 12:37 PM IST

Updated : Sep 28, 2019, 7:33 AM IST

మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు
మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ రక్షణను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రత కేటాయించింది. వివిధ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.

"మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రత కేటాయించాం. కాలానుగుణంగా తీసుకునే చర్యల్లో ఇదొక భాగం. వివిధ భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నాం."
--- హోంశాఖ ప్రతినిధి.

ప్రత్యేక రక్షణ బృందం(ఎస్​పీజీ), వివిధ నిఘా సంస్థల నివేదికతో కేబినెట్​ సెక్రటేరియట్​, హోంశాఖ మూడు నెలల పాటు సమీక్షించిన అనంతరం మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రతను కేటాయించింది. ఇందులో భాగంగా మాజీ ప్రధానికి సీఆర్​పీఎఫ్​ రక్షణ కల్పించే అవకాశముంది.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ నేతలు రాహుల్​, ప్రియాంక గాంధీకి మాత్రమే ఇప్పుడు ఎస్​పీజీ భద్రత ఉంది.

ఎస్​పీజీ 1988 చట్టం ప్రకారం మన్మోహన్​ ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఏడాది వరకు ఎస్​పీజీ భద్రతను కేటాయించాలి. కానీ మన్మోహన్​, అయన భార్య గురుశరన్​​ కౌర్​కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ఎస్​పీజీ భద్రతను పొడిగించారు.

ఇదీ చూడండి:- తుపానుపై అణు బాంబు వేస్తే సరి: డొనాల్డ్​ ట్రంప్​

మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ రక్షణను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రత కేటాయించింది. వివిధ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.

"మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రత కేటాయించాం. కాలానుగుణంగా తీసుకునే చర్యల్లో ఇదొక భాగం. వివిధ భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నాం."
--- హోంశాఖ ప్రతినిధి.

ప్రత్యేక రక్షణ బృందం(ఎస్​పీజీ), వివిధ నిఘా సంస్థల నివేదికతో కేబినెట్​ సెక్రటేరియట్​, హోంశాఖ మూడు నెలల పాటు సమీక్షించిన అనంతరం మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రతను కేటాయించింది. ఇందులో భాగంగా మాజీ ప్రధానికి సీఆర్​పీఎఫ్​ రక్షణ కల్పించే అవకాశముంది.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ నేతలు రాహుల్​, ప్రియాంక గాంధీకి మాత్రమే ఇప్పుడు ఎస్​పీజీ భద్రత ఉంది.

ఎస్​పీజీ 1988 చట్టం ప్రకారం మన్మోహన్​ ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఏడాది వరకు ఎస్​పీజీ భద్రతను కేటాయించాలి. కానీ మన్మోహన్​, అయన భార్య గురుశరన్​​ కౌర్​కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ఎస్​పీజీ భద్రతను పొడిగించారు.

ఇదీ చూడండి:- తుపానుపై అణు బాంబు వేస్తే సరి: డొనాల్డ్​ ట్రంప్​

AP Video Delivery Log - 0200 GMT News
Monday, 26 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0142: Brazil Amazon Fires AP Clients Only 4226664
Troops, firefighters battle blaze in Amazon
AP-APTN-0021: France G7 Trudeau Jogging No access Australia 4226663
Trudeau goes for run in Biarritz before G7 talks
AP-APTN-0002: Brazil Amazon Protest AP Clients Only 4226662
Protests in Rio de Janeiro over Amazon fires
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.