ETV Bharat / bharat

'ఆ 2 ఘటనలు కరోనాపై పోరులో ఎదురుదెబ్బలు'

author img

By

Published : Apr 3, 2020, 7:21 PM IST

కరోనా నియంత్రణకు కేంద్రం చేపడుతున్న చర్యలకు... ఆనంద్​ విహార్​, తబ్లీగీ ప్రార్థన ఘటనలు తీవ్ర విఘాతం కలిగించాయని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులపై జరుగుతున్న దాడులు చాలా దురదృష్టకరమన్నారు

Gathering of migrant workers, Tablighi Jamaat meet setback to efforts to combat coronavirus: Prez
గవర్నర్లతో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ వీడియో కాన్ఫరెన్స్

దిల్లీ ఆనంద్​ విహార్​లో వలస కార్మికులు గుమిగూడడం, నిజాముద్దీన్​లో తబ్లీగీ ప్రార్థనలు నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనల వల్ల కరోనా నియంత్రణ చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

రామ్​నాథ్ కోవింద్​... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి వీడియో లింక్​ ద్వారా రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడారు. లాక్​డౌన్​ కొనసాగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ ఒక్కరూ పస్తులు లేకుండా చూడాలని సూచించారు. ఆహారం, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

దాడులు దురదృష్టకరం

ప్రజలు సామాజిక, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు.

ఆదుకోవాలి..

ఈ సంక్షోభ సమయంలో నిరాశ్రయులు, నిరుద్యోగులు, బలహీన వర్గాల వారిని ఆదుకోవాలని రామ్​నాథ్​ కోవింద్... గవర్నర్లను ఆదేశించారు. కొవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి చర్చించారు.

ఇదీ చూడండి: మర్కజ్​కు వెళ్లిన విదేశీయులపై కేంద్రం కొరడా

దిల్లీ ఆనంద్​ విహార్​లో వలస కార్మికులు గుమిగూడడం, నిజాముద్దీన్​లో తబ్లీగీ ప్రార్థనలు నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనల వల్ల కరోనా నియంత్రణ చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

రామ్​నాథ్ కోవింద్​... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి వీడియో లింక్​ ద్వారా రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడారు. లాక్​డౌన్​ కొనసాగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ ఒక్కరూ పస్తులు లేకుండా చూడాలని సూచించారు. ఆహారం, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

దాడులు దురదృష్టకరం

ప్రజలు సామాజిక, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు.

ఆదుకోవాలి..

ఈ సంక్షోభ సమయంలో నిరాశ్రయులు, నిరుద్యోగులు, బలహీన వర్గాల వారిని ఆదుకోవాలని రామ్​నాథ్​ కోవింద్... గవర్నర్లను ఆదేశించారు. కొవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి చర్చించారు.

ఇదీ చూడండి: మర్కజ్​కు వెళ్లిన విదేశీయులపై కేంద్రం కొరడా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.