ETV Bharat / bharat

కేంద్ర మాజీమంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కన్నుమూత

author img

By

Published : Sep 13, 2020, 12:04 PM IST

Updated : Sep 13, 2020, 1:12 PM IST

Former Union Minister Raghuvansh PRASAD SINGH PASSED AWAY
కేంద్ర మాజీమంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కన్నుమూత

12:23 September 13

మన్రేగా రూపశిల్పి రఘువంశ్​..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం- మన్రేగాకు రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​(74) ఇకలేరు. కరోనా సోకి వారం రోజులుగా దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆర్​జేడీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకొని 3 రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన రఘువంశ్ శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. పరిస్ధితి విషమించగా.. వెంటిలేటర్​ అమర్చి చికిత్స కొనసాగిస్తున్న తరుణంలోనే తుది శ్వాస విడిచారు. ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగిన రఘువంశ్.. ఈ నెల 10న ఆసుపత్రి నుంచే రాజీనామా లేఖను ఆయనకు పంపించారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన రఘువంశ్​ ఎంతో మంది పేదలకు ఉపాధి చూపిస్తున్న మన్రేగాను రూపొందించారు. 

రఘువంశ్​కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఆయన భార్య గతంలోనే చనిపోయారు. అంత్యక్రియల నిమిత్తం రఘువంశ్​ భౌతిక కాయాన్ని దిల్లీ నుంచి పట్నా తరలించనున్నారు.

ప్రముఖుల సంతాపం..

రఘువంశ్​ మరణం విషాదాన్ని నింపిందని అన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. గ్రామీణ భారతం అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

రఘువంశ్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి బిహార్​ సహా దేశ రాజకీయాల్లో శూన్యతను మిగిల్చిందని ట్వీట్​ చేశారు. 

కేంద్ర మాజీ మంత్రి సేవలు మరువలేనివని అన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. గ్రామాలు, రైతుల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. 

11:58 September 13

కేంద్ర మాజీమంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్ మరణించారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. 

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో ఇటీవల చేరారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 32సంవత్సరాలు పార్టీలో కొనసాగిన ఆయన, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు రాజీనామా లేఖను పంపారు. 

12:23 September 13

మన్రేగా రూపశిల్పి రఘువంశ్​..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం- మన్రేగాకు రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​(74) ఇకలేరు. కరోనా సోకి వారం రోజులుగా దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆర్​జేడీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకొని 3 రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన రఘువంశ్ శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. పరిస్ధితి విషమించగా.. వెంటిలేటర్​ అమర్చి చికిత్స కొనసాగిస్తున్న తరుణంలోనే తుది శ్వాస విడిచారు. ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగిన రఘువంశ్.. ఈ నెల 10న ఆసుపత్రి నుంచే రాజీనామా లేఖను ఆయనకు పంపించారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన రఘువంశ్​ ఎంతో మంది పేదలకు ఉపాధి చూపిస్తున్న మన్రేగాను రూపొందించారు. 

రఘువంశ్​కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఆయన భార్య గతంలోనే చనిపోయారు. అంత్యక్రియల నిమిత్తం రఘువంశ్​ భౌతిక కాయాన్ని దిల్లీ నుంచి పట్నా తరలించనున్నారు.

ప్రముఖుల సంతాపం..

రఘువంశ్​ మరణం విషాదాన్ని నింపిందని అన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. గ్రామీణ భారతం అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

రఘువంశ్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి బిహార్​ సహా దేశ రాజకీయాల్లో శూన్యతను మిగిల్చిందని ట్వీట్​ చేశారు. 

కేంద్ర మాజీ మంత్రి సేవలు మరువలేనివని అన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. గ్రామాలు, రైతుల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. 

11:58 September 13

కేంద్ర మాజీమంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్ మరణించారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. 

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో ఇటీవల చేరారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 32సంవత్సరాలు పార్టీలో కొనసాగిన ఆయన, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు రాజీనామా లేఖను పంపారు. 

Last Updated : Sep 13, 2020, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.