ETV Bharat / bharat

'విమర్శించిన ఎంపీలనే భాజపాలో చేర్చుకున్నారు'

రాజకీయాల్లో భాజపా  ఏం చేసినా కమలనాథులకు న్యాయంగానే అనిపిస్తుందని బహుజన్ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు. రాజ్యసభలోని నలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులు భాజపాలోకి ఫిరాయించడంపై మాయ ఘాటుగా స్పందించారు.

author img

By

Published : Jun 21, 2019, 6:46 PM IST

Updated : Jun 21, 2019, 7:50 PM IST

భాజపా ఏం చేసినా న్యాయమే: మాయావతి

భాజపా 'ఆపరేషన్​ ఆకర్ష్'పై బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు భాజపాలో చేరడంపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

మాయావతి ట్వీట్
మాయావతి ట్వీట్

"రాష్ట్రపతి నిన్న తన ప్రసంగంలో ప్రభుత్వం తరఫున దేశానికి హామీలు ఇస్తుంటే... అదే రోజు భాజపా ఆపరేషన్​ ఆకర్ష్​తో నలుగురు తెదేపా ఎంపీలను లాగేసుకుంది. అందులో ఇద్దరు ఎంపీలను భాజపా గతంలో 'ఆంధ్ర మాల్యా​' అని విమర్శించింది. ఇప్పుడు వారినే పార్టీలోకి చేర్చుకొంది. ఇదంతా చూస్తుంటే ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది. భాజపా ఏం చేసినా అది న్యాయమే."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ఇదీ నేపథ్యం..

రాజ్యసభలో తెదేపా తరఫున ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆరుగురిలో నలుగురు ఎంపీలు నిన్న భాజపా చెంతకు చేరారు. అంతేకాకుండా భాజపాలోకి తెదేపా రాజ్యసభా పక్షాన్ని విలీనం చేయాలని ఉపరాష్ట్రపతిని కోరారు.

భాజపా 'ఆపరేషన్​ ఆకర్ష్'పై బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు భాజపాలో చేరడంపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

మాయావతి ట్వీట్
మాయావతి ట్వీట్

"రాష్ట్రపతి నిన్న తన ప్రసంగంలో ప్రభుత్వం తరఫున దేశానికి హామీలు ఇస్తుంటే... అదే రోజు భాజపా ఆపరేషన్​ ఆకర్ష్​తో నలుగురు తెదేపా ఎంపీలను లాగేసుకుంది. అందులో ఇద్దరు ఎంపీలను భాజపా గతంలో 'ఆంధ్ర మాల్యా​' అని విమర్శించింది. ఇప్పుడు వారినే పార్టీలోకి చేర్చుకొంది. ఇదంతా చూస్తుంటే ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది. భాజపా ఏం చేసినా అది న్యాయమే."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ఇదీ నేపథ్యం..

రాజ్యసభలో తెదేపా తరఫున ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆరుగురిలో నలుగురు ఎంపీలు నిన్న భాజపా చెంతకు చేరారు. అంతేకాకుండా భాజపాలోకి తెదేపా రాజ్యసభా పక్షాన్ని విలీనం చేయాలని ఉపరాష్ట్రపతిని కోరారు.

Kaleshwaram (Telangana), June 21 (ANI): Telangana chief minister K Chandrasekhar Rao on Friday inaugurated the Kaleshwaram Lift Irrigation Project (KLIP) which is said to be the world's biggest in terms of capacity. While speaking to ANI, Maharashtra Chief Minister Devendra Fadnavis said, "Kaleshwaram Lift Irrigation Project is a gift from the people of Maharashtra to the people of Telangana. Telangana completed this project at a record speed. This project will change the face of Telangana." Chief Minister of Andhra Pradesh Jagan Mohan Reddy was also present during inaugural function.

Last Updated : Jun 21, 2019, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.