చైనాలో చిక్కుకున్న 18 మంది భారత నావికులు ఈనెల 14న భారత్కు చేరనున్నారని నౌకా రవాణా, జలమార్గాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు. జపాన్ నుంచి బృందం బుధవారం బయలుదేరనుందని తెలిపారు. త్వరలోనే వారు వారి కుటుంబీకులను కలుస్తారని అన్నారు.
ఎంవీ అనస్తాసియా నౌక బృందం తిరుగు ప్రయాణానికి కృషి చేసిన భారత దౌత్య కార్యాలయం, మెడిటెరేనియన్ షిప్ సంస్థలను మంత్రి ప్రశంసించారు.
గతేడాది సెప్టెంబరు నుంచి 18 మంది నావికులు చైనా తీరంలో చిక్కుకున్నారు. ఇదివరకు ఇదే విధంగా చిక్కుకున్న 23 మంది సభ్యలు గల ఎంవీ జగ్ ఆనంద్ నౌక బృందాన్ని.. ఈ ఏడాది జనవరి 14న భారత్కు తీసుకువచ్చారు.
ఇదీ చదవండి : 'భారత్- చైనా ఉద్రిక్తతలను గమనిస్తున్నాం'