ETV Bharat / bharat

దిల్లీ హైకోర్టులో దినకరన్​కు ఊరట

author img

By

Published : Mar 8, 2019, 7:54 PM IST

అన్నాడీఎంకే మాజీ నేత టీటీవీ దినకరన్​కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 'రెండాకుల గుర్తు కేసు' విచారణ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తు కోసం ఎన్నికల కమిషన్​కు లంచం ఇవ్వజూపారనేది ఆయనపై ఆరోపణ.

దినకరన్​

అన్నాడీఎంకే మాజీ నేత టీటీవీ దినకరన్​కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. రెండాకుల గుర్తుపై ట్రయల్​ కోర్టు విచారణను నిలిపేయాలని దిల్లీ హైకోర్టు స్టే విధించింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులకు భారీగా లంచం ఇవ్వజూపారని దినకరన్​పై అభియోగాలున్నాయి.

ఈ వ్యవహారంలో దినకరన్​పై కేసులు పెట్టాలని పలువురు అన్నాడీఎంకే నేతలు కోర్టును ఆశ్రయించారు. ఐపీసీ సెక్షన్​120బీ (మోసపూరిత కుట్ర), 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం)తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 కింద ట్రయల్ కోర్టు కేసు నమోదు చేసింది.

ట్రయల్​ కోర్టు నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దినకరన్​ 2018 డిసెంబరు 4న సీనియర్​ న్యాయవాది అరవింద్​ నిగమ్​, నవీన్​ మల్హోత్రాల ద్వారా దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ట్రయల్​ కోర్టు విచారణను నిలిపేస్తూ దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 20కి వాయిదా వేసింది.

అన్నాడీఎంకే మాజీ నేత టీటీవీ దినకరన్​కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. రెండాకుల గుర్తుపై ట్రయల్​ కోర్టు విచారణను నిలిపేయాలని దిల్లీ హైకోర్టు స్టే విధించింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులకు భారీగా లంచం ఇవ్వజూపారని దినకరన్​పై అభియోగాలున్నాయి.

ఈ వ్యవహారంలో దినకరన్​పై కేసులు పెట్టాలని పలువురు అన్నాడీఎంకే నేతలు కోర్టును ఆశ్రయించారు. ఐపీసీ సెక్షన్​120బీ (మోసపూరిత కుట్ర), 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం)తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 కింద ట్రయల్ కోర్టు కేసు నమోదు చేసింది.

ట్రయల్​ కోర్టు నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దినకరన్​ 2018 డిసెంబరు 4న సీనియర్​ న్యాయవాది అరవింద్​ నిగమ్​, నవీన్​ మల్హోత్రాల ద్వారా దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ట్రయల్​ కోర్టు విచారణను నిలిపేస్తూ దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 20కి వాయిదా వేసింది.


New Delhi, Mar 08 (ANI): United State President Donald trump's 2016 presidential campaign chairman, Paul Manafort was awarded 47 months in prison on Thursday. He was convicted on charges of stemming from special counsel Robert Mueller's investigation into Russian collusion in the 2016 presidential election. Manafort, who is 69, was earlier looking at a minimum of 25 years in prison, a sentence that could have essentially kept him in jail for the rest of his life. However, even at just under four years, Manafort's sentence is the longest given yet to any defendant in the Mueller probe. Last year he was convicted on charges of tax fraud, bank fraud and failure to report foreign bank accounts. Manafort also failed to pay taxes on millions of dollars in income he earned from Ukrainian political consulting.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.