దేశ వ్యాప్తంగా హిందీ ఉమ్మడి భాషగా ఉండాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలపై స్పందించారు ప్రముఖ నటుడు రజనీకాంత్. హిందీ భాషను బలవంతంగా రుద్దడం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా, పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సమ్మతం కాదన్నారు.
ఏ దేశానికైనా ఉమ్మడి భాష ఉండడం ఆ దేశ ఐక్యతకు, అభివృద్ధికి మంచిదని తెలిపిన రజనీ... మన దేశంలో మాత్రం ఒక ఉమ్మడి భాషను తీసుకురావడం అసాధ్యమని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దితే తమిళనాడే కాకుండా మిగతా దక్షిణాది రాష్ట్రాలు,పలు ఉత్తర భారత రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తాయన్నారు.
ఇదీ చూడండి: కొడుకు ఉద్యోగం కోసం భర్తను ముక్కలుగా నరికిన మహిళ