ETV Bharat / bharat

రామజన్మ భూమిలో తొలిసారి హారతి దర్శనం ఆ రోజే

author img

By

Published : Mar 15, 2020, 11:45 AM IST

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా అయోధ్యలో తొలిసారి భక్తులు హారతిని దర్శించుకోనున్నారు. అదే రోజున రాముని విగ్రహాలను రామజన్మభూమి వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక ఆలయానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమం వాయిదాకు డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. స్థానిక పాలనా యంత్రాంగం వేడుకలను నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది.

Devotees can witness devotional worship at Ram Janambhoomi next month
అయోధ్య రామజన్మ భూమిలో తొలిసారి హారతి దర్శనం

వచ్చే నెలలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలో మొట్టమొదటి సారి భక్తులు హారతిని దర్శించుకోనున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ఆలయంలో రాముని విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

భక్తులకు అనుమతి

విగ్రహాల తరలింపు కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ట్రస్టు అనుమతించింది. ఈ ఏడాది నిర్వహించే వేడుకల ఖర్చును రూ. 51వేల నుంచి రూ.లక్షా 50వేలకు పెంచింది. బాబ్రీ మసీదు ఘటనకు ముందు 1992 నుంచే రామ జన్మభూమిలో పూజారిగా ఉంటున్న మహంత్​ సతేంద్ర దాస్​.. నిధుల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు.

వేడుకలపై కరోనా ప్రభావం..

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్​ 2న శ్రీరామ నవమి వేడుకలను రద్దు చేయాలని కొంతమంది డిమాండ్​ చేశారు. అయితే స్థానిక పాలనా యంత్రాంగం కార్యక్రమాన్ని నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది.

భూమి పూజకు తేదీ ఖరారు..

ఇటీవల రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణ ట్రస్టుకు నేతృత్వం వహిస్తోన్న నిత్య గోపాల్​ దాస్​ అధ్యక్షతన ఏప్రిల్​ 14న సమావేశం జరగనుంది. ఇందులో ఆలయ నిర్మాణ భూమి పూజకు తేదీని ఖరారు చేయనున్నారు.

వచ్చే నెలలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలో మొట్టమొదటి సారి భక్తులు హారతిని దర్శించుకోనున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ఆలయంలో రాముని విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

భక్తులకు అనుమతి

విగ్రహాల తరలింపు కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ట్రస్టు అనుమతించింది. ఈ ఏడాది నిర్వహించే వేడుకల ఖర్చును రూ. 51వేల నుంచి రూ.లక్షా 50వేలకు పెంచింది. బాబ్రీ మసీదు ఘటనకు ముందు 1992 నుంచే రామ జన్మభూమిలో పూజారిగా ఉంటున్న మహంత్​ సతేంద్ర దాస్​.. నిధుల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు.

వేడుకలపై కరోనా ప్రభావం..

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్​ 2న శ్రీరామ నవమి వేడుకలను రద్దు చేయాలని కొంతమంది డిమాండ్​ చేశారు. అయితే స్థానిక పాలనా యంత్రాంగం కార్యక్రమాన్ని నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది.

భూమి పూజకు తేదీ ఖరారు..

ఇటీవల రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణ ట్రస్టుకు నేతృత్వం వహిస్తోన్న నిత్య గోపాల్​ దాస్​ అధ్యక్షతన ఏప్రిల్​ 14న సమావేశం జరగనుంది. ఇందులో ఆలయ నిర్మాణ భూమి పూజకు తేదీని ఖరారు చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.