పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చినట్లు లోక్సభ సభాపతి ఓంబిర్లా వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని ఆయన అఖిలపక్ష భేటీ నిర్వహించారు.
![Delhi: An all-party meeting was chaired today by the Lok Sabha Speaker Om Prakash Birla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10426859_1.jpg)
" పార్లమెంటు సమావేశాల్లో అర్థవంతమైన, విస్తృతమైన చర్చ జరగాలని, రాజ్యాంగ బాధ్యతలను, సభా మర్యాదలను కాపాడాలని సభ్యులను కోరాను. అన్నిపార్టీల పక్ష నేతలు.. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్నారు. ఏ సభ్యుడైనా, పార్టీ పక్ష నేత అయినా సమస్యల ప్రస్తావన, చర్చతో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు సభ ముందు ఉంచాలనుకుంటే అందుకు తగిన సమయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను."
- ఓంబిర్లా, లోక్సభ సభాపతి
గత నాలుగు సమావేశాల మాదిరిగానే ఈ బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు ఓంబిర్లా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుక