ETV Bharat / bharat

రష్యాకు రాజ్​నాథ్​- అత్యవసర యుద్ధ సామగ్రి కోసమే!

author img

By

Published : Jun 22, 2020, 4:14 PM IST

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో రష్యా ఎగుమతి చేసిన యుద్ధ సామగ్రికి సంబంధించి విడిభాగాలు, పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రాజ్​నాథ్​ కోరనున్నట్లు సమాచారం.

Def Min
రాజ్​నాథ్​

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ 3 రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు బయలుదేరారు. ఈ పర్యటనలో రష్యాలోని కీలక రాజకీయ నాయకులతో రాజ్​నాథ్​ భేటీ కానున్నారు. లద్ధాఖ్​లో నెలకొన్న పరిస్థితులు, చైనా ఏర్పాటు చేసుకున్న స్థావరాలకు సంబంధించి వివరించనున్నారు.

ఈ పర్యటనలోనే యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకుల కోసం విడిభాగాలు, అనుబంధ పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రష్యాను కోరనున్నట్లు తెలుస్తోంది.

"వైమానిక దళానికి సుఖోయ్​-30 ఎంకేఐ, మిగ్-29, నౌకాదళానికి మిగ్- 29కే, కిలో క్లాస్ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, సైన్యానికి టీ-90 ట్యాంకులను రష్యా విక్రయించింది. వీటికి సంబంధించిన విడిభాగాలు, పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రక్షణ మంత్రి కోరనున్నారు."

- ప్రభుత్వ వర్గాలు

రష్యా నాయకులతో చర్చల సందర్భంగా, వచ్చే ఏడాది చివరి నాటికి సరఫరా చేయాల్సిన ఎస్- 400 వైమానిక రక్షణ వ్యవస్థల పంపిణీని వేగవంతం చేయాలని రక్షణ మంత్రి వారిని కోరనున్నారు. చెల్లింపుల్లో సమస్యల కారణంగా ఎస్​-400 అందించటంలో ఆలస్యం జరిగింది.

అత్యాధునిక సాంకేతికత...

ఎస్​- 400 అనేది రష్యాకు చెందిన అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే వ్యవస్థగా దీనిని పిలుస్తారు. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ 3 రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు బయలుదేరారు. ఈ పర్యటనలో రష్యాలోని కీలక రాజకీయ నాయకులతో రాజ్​నాథ్​ భేటీ కానున్నారు. లద్ధాఖ్​లో నెలకొన్న పరిస్థితులు, చైనా ఏర్పాటు చేసుకున్న స్థావరాలకు సంబంధించి వివరించనున్నారు.

ఈ పర్యటనలోనే యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకుల కోసం విడిభాగాలు, అనుబంధ పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రష్యాను కోరనున్నట్లు తెలుస్తోంది.

"వైమానిక దళానికి సుఖోయ్​-30 ఎంకేఐ, మిగ్-29, నౌకాదళానికి మిగ్- 29కే, కిలో క్లాస్ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, సైన్యానికి టీ-90 ట్యాంకులను రష్యా విక్రయించింది. వీటికి సంబంధించిన విడిభాగాలు, పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రక్షణ మంత్రి కోరనున్నారు."

- ప్రభుత్వ వర్గాలు

రష్యా నాయకులతో చర్చల సందర్భంగా, వచ్చే ఏడాది చివరి నాటికి సరఫరా చేయాల్సిన ఎస్- 400 వైమానిక రక్షణ వ్యవస్థల పంపిణీని వేగవంతం చేయాలని రక్షణ మంత్రి వారిని కోరనున్నారు. చెల్లింపుల్లో సమస్యల కారణంగా ఎస్​-400 అందించటంలో ఆలస్యం జరిగింది.

అత్యాధునిక సాంకేతికత...

ఎస్​- 400 అనేది రష్యాకు చెందిన అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే వ్యవస్థగా దీనిని పిలుస్తారు. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.