ETV Bharat / bharat

వారణాసిలో మోదీపై చనిపోయిన వ్యక్తి పోటీ!

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు చనిపోయిన వ్యక్తి రామ్ అవతార్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ఆజమ్​గఢ్ జిల్లా గోవింద్ పట్టీకి చెందిన యాదవ్... తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకే ప్రధానిపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

author img

By

Published : Apr 13, 2019, 6:30 AM IST

వారణాసిలో మోదీపై చనిపోయిన వ్యక్తి పోటీ

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై మరో వ్యక్తి పోటీకి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఓ జవాను.. వారణాసిలో నామపత్రం దాఖలు చేశారు. ఇప్పడు ఓ చనిపోయిన వ్యక్తి మోదీపై పోటీ చేస్తానంటున్నాడు. చనిపోయిన వ్యక్తి పోటీ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు రామ్ అవతార్ అనే వ్యక్తి​.

అసలు కథ ఏంటంటే..?

2005లో రామ్​ అవతార్ యాదవ్​ చనిపోయినట్లు తప్పడు ధ్రువపత్రాలు సృష్టించి ఆయనకున్న మూడున్నర ఎకరాల భూమిని ఒక భూస్వామి తన పేరు మీదకు మార్చుకున్నాడు.

తాను చనిపోలేదని నిరూపించుకోవడానికి రామ్​ యాదవ్​కు 8 ఏళ్లు పట్టింది. దీని కోసం మండల అధికారులను, జిల్లా అధికారులను, అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​నూ కలిశారు.

నవంబర్​ 2013లో తాను బ్రతికే ఉన్నట్లు అధికారికంగా నిరూపించుకున్నారు. కాని ఇప్పటికీ తన మూడున్నర ఎకారాల భూమి తనకు దక్కలేదు. ఆ భూమి కబ్జాకు గురైంది.

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలిపేందుకు రామ్ యాదల్ ప్రధానిపై ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై మరో వ్యక్తి పోటీకి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఓ జవాను.. వారణాసిలో నామపత్రం దాఖలు చేశారు. ఇప్పడు ఓ చనిపోయిన వ్యక్తి మోదీపై పోటీ చేస్తానంటున్నాడు. చనిపోయిన వ్యక్తి పోటీ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు రామ్ అవతార్ అనే వ్యక్తి​.

అసలు కథ ఏంటంటే..?

2005లో రామ్​ అవతార్ యాదవ్​ చనిపోయినట్లు తప్పడు ధ్రువపత్రాలు సృష్టించి ఆయనకున్న మూడున్నర ఎకరాల భూమిని ఒక భూస్వామి తన పేరు మీదకు మార్చుకున్నాడు.

తాను చనిపోలేదని నిరూపించుకోవడానికి రామ్​ యాదవ్​కు 8 ఏళ్లు పట్టింది. దీని కోసం మండల అధికారులను, జిల్లా అధికారులను, అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​నూ కలిశారు.

నవంబర్​ 2013లో తాను బ్రతికే ఉన్నట్లు అధికారికంగా నిరూపించుకున్నారు. కాని ఇప్పటికీ తన మూడున్నర ఎకారాల భూమి తనకు దక్కలేదు. ఆ భూమి కబ్జాకు గురైంది.

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలిపేందుకు రామ్ యాదల్ ప్రధానిపై ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

New Delhi, Apr 12 (ANI): Unione Defence Minister Nirmala Sitharaman spoke about the purported letter to President Ram Nath Kovind signed by Armed Forces veterans. She said, "Two senior officers said that they have not given consent, worrying that fake letters being signed by vested groups. It is absolutely condemnable. Rashtrapati Bhavan has also said that they have not received the letter."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.