ETV Bharat / bharat

ఇటలీని దాటేసిన భారత్​- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

author img

By

Published : Jun 6, 2020, 9:20 AM IST

Updated : Jun 6, 2020, 10:09 AM IST

దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. కేసులపరంగా భారత్..​ ఇటలీని దాటిపోయింది. గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 9,887 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 294 మంది ప్రాణాలు కోల్పోయారు.

daily corona virus updates
కరోనా కేసుల్లో ఇటలీని మించిన భారత్​

దేశంలో లాక్​డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులపరంగా భారత్​ ఇటలీని మించిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,887 కొత్త కేసులు, 294 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం.

daily corona virus updates
ఇటలీని దాటేసిన భారత్​- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

ఆరో స్థానం..

కరోనా కేసుల సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. భారత్​ కంటే ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే మాత్రమే ఉన్నాయి. అయితే కేసులు ఎక్కువ అవుతున్నా.. మరణాలు రేటు మాత్రం మాత్రం తక్కువగానే ఉండటం కాస్త ఊరట.

రాష్ట్రాలవారీగా

కొత్తగా నమోదైన 294 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 139, దిల్లీ- 58, గుజరాత్​- 35, తమిళనాడు- 12, ఉత్తర్​ప్రదేశ్​- 12, బంగాల్- 11, తెలంగాణ- 8, మధ్యప్రదేశ్- 7, రాజస్థాన్​- 5, ఆంధ్రప్రదేశ్​- 2; జమ్ము కశ్మీర్​, ఒడిశా, పంజాబ్​, ఝార్ఖండ్​, ఉత్తరాఖండ్​ల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కరోనా కాలంలో 'యోగా డే' కోసం కేంద్రం కొత్త ప్లాన్

దేశంలో లాక్​డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులపరంగా భారత్​ ఇటలీని మించిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,887 కొత్త కేసులు, 294 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం.

daily corona virus updates
ఇటలీని దాటేసిన భారత్​- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

ఆరో స్థానం..

కరోనా కేసుల సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. భారత్​ కంటే ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే మాత్రమే ఉన్నాయి. అయితే కేసులు ఎక్కువ అవుతున్నా.. మరణాలు రేటు మాత్రం మాత్రం తక్కువగానే ఉండటం కాస్త ఊరట.

రాష్ట్రాలవారీగా

కొత్తగా నమోదైన 294 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 139, దిల్లీ- 58, గుజరాత్​- 35, తమిళనాడు- 12, ఉత్తర్​ప్రదేశ్​- 12, బంగాల్- 11, తెలంగాణ- 8, మధ్యప్రదేశ్- 7, రాజస్థాన్​- 5, ఆంధ్రప్రదేశ్​- 2; జమ్ము కశ్మీర్​, ఒడిశా, పంజాబ్​, ఝార్ఖండ్​, ఉత్తరాఖండ్​ల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కరోనా కాలంలో 'యోగా డే' కోసం కేంద్రం కొత్త ప్లాన్

Last Updated : Jun 6, 2020, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.