కర్ణాటక చిత్రదుర్గ ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో రూ.36 లక్షల విలువైన నగదు బయటపడింది. ఈ డబ్బు 'దిలీప్ బిల్డ్ ఖాన్' అనే జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ నుంచి దొంగలించిన సొమ్మేనని పోలీసులు గుర్తించారు. డబ్బులు బయటపడిన ప్రాంతం ఈ కంపెనీకి సమీపంలోనే ఉంది.
![Currency notes worth Rs 36 lakhs found abondoned in farm land](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ctd-01-08-36laksha-av-7204336_08102020135815_0810f_1602145695_634_0910newsroom_1602210832_541.jpg)
జిల్లాలోని చల్లకెరే తాలుకా, బక్లూరహళ్లిలో ఉన్న సంస్థ తాత్కాలిక కార్యాలయం నుంచి మూడు రోజుల క్రితం నగదు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం సమీపంలోనే డబ్బును గుర్తించిన పోలీసులు.. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.
ఇదీ చదవండి- కారాగారాలు దిద్దుబాటలో నడిస్తే సంస్కరణలకు నిలయాలే