కరోనా వైరస్ పట్ల కొందరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో బంగాల్లో తాజాగా జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. బంగాల్లోని మల్దాలో ఇటీవల ఓ ఫాస్ట్ఫుడ్ స్టాల్ యజమానికి కొవిడ్-19 సోకింది. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ చికిత్స తీసుకోవాల్సిన అతడు.. ఏమీ పట్టనట్టుగా.. 14 రోజుల క్వారంటైన్ గడువైనా పూర్తికాకముందే శనివారం తన స్టాల్ తెరిచాడు. అతడు తయారుచేసిన ఫాస్ట్ఫుడ్ను అక్కడి ప్రజలు కూడా కొన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది అక్కడికి వచ్చి ఫాస్ట్ఫుడ్ సెంటర్ను మూసివేయించారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా కొత్తగా 19,906 కేసులు, 410 మరణాలు