ETV Bharat / bharat

భారత్​లో 548 మంది వైద్య సిబ్బందికి కరోనా

author img

By

Published : May 6, 2020, 4:23 PM IST

కరోనా మహమ్మారి వైద్యులనూ వదలటం లేదు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 548 మంది వైద్య సబ్బంది ఈ వైరస్​ బారిన పడినట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో దిల్లీలోని సఫ్దార్​గంజ్​, ఎయిమ్స్​ సహా ఇతర ఆస్పత్రుల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు తెలిసింది.

COVID-19 infects 548 docs
దేశవ్యాప్తంగా కరోనా బారిన 548 మంది వైద్యులు!

కరోనా సోకిన వారికి సేవలందిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులకూ ఈ వైరస్​ ముప్పు తప్పటం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారమెడిక్​ సిబ్బంది కలిపి మొత్తం 548 మందికి ఈ మహమ్మారి సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే.. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది, వార్డ్​ బాయ్స్​, శానిటేషన్​ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, ల్యాబ్​ సిబ్బంది, ప్యూన్లు, లాండ్రీ, కిచెన్​ సిబ్బందిని కలపలేదని తెలిపారు అధికారులు. కరోనా సోకిన వైద్య సిబ్బందికి ఎక్కడి నుంచి వైరస్​ సంక్రమించిందనే విషయం నిర్ధరించలేదని చెప్పారు.

కేసుల సంక్రమణపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు. అందువల్ల.. పని ప్రదేశంలో ఎంత మందికి వైరస్​ సోకింది, ఎంత మందికి ఇతర మార్గాల ద్వారా సంక్రమించిందనే స్పష్టమైన వివరాలు లేవు. కొంత మంది వైద్యులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఎంత మంది అనే సంఖ్య ప్రస్తుతానికి తెలియదు.

- అధికార వర్గాలు

దిల్లీలోనే అధికం..

దేశ రాజధాని దిల్లీలో 69 మంది వైద్యులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. 274 మంది నర్సలు, పారామెడిక్స్​కు వైరస్​ సోకినట్లు చెప్పారు. సఫ్దార్​గంజ్​ ఆస్పత్రిలో ఏడుగురు రెసిడెంట్​ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్​ సహా 13 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించారు. దిల్లీ ఎయిమ్స్​లో ఒక రెసిడెంట్​​ డాక్టర్​, ఐదుగురు నర్సులు సహా.. మొత్తం 10 మంది వైద్య సిబ్బందికి వైరస్​ సోకింది. వీరితో పాటు దిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తోన్న వివిధ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా సోకిన వారికి సేవలందిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులకూ ఈ వైరస్​ ముప్పు తప్పటం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారమెడిక్​ సిబ్బంది కలిపి మొత్తం 548 మందికి ఈ మహమ్మారి సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే.. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది, వార్డ్​ బాయ్స్​, శానిటేషన్​ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, ల్యాబ్​ సిబ్బంది, ప్యూన్లు, లాండ్రీ, కిచెన్​ సిబ్బందిని కలపలేదని తెలిపారు అధికారులు. కరోనా సోకిన వైద్య సిబ్బందికి ఎక్కడి నుంచి వైరస్​ సంక్రమించిందనే విషయం నిర్ధరించలేదని చెప్పారు.

కేసుల సంక్రమణపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు. అందువల్ల.. పని ప్రదేశంలో ఎంత మందికి వైరస్​ సోకింది, ఎంత మందికి ఇతర మార్గాల ద్వారా సంక్రమించిందనే స్పష్టమైన వివరాలు లేవు. కొంత మంది వైద్యులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఎంత మంది అనే సంఖ్య ప్రస్తుతానికి తెలియదు.

- అధికార వర్గాలు

దిల్లీలోనే అధికం..

దేశ రాజధాని దిల్లీలో 69 మంది వైద్యులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. 274 మంది నర్సలు, పారామెడిక్స్​కు వైరస్​ సోకినట్లు చెప్పారు. సఫ్దార్​గంజ్​ ఆస్పత్రిలో ఏడుగురు రెసిడెంట్​ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్​ సహా 13 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించారు. దిల్లీ ఎయిమ్స్​లో ఒక రెసిడెంట్​​ డాక్టర్​, ఐదుగురు నర్సులు సహా.. మొత్తం 10 మంది వైద్య సిబ్బందికి వైరస్​ సోకింది. వీరితో పాటు దిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తోన్న వివిధ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.