ETV Bharat / bharat

'ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల్లో కొత్త రూల్స్'

author img

By

Published : Aug 18, 2020, 4:30 PM IST

కరోనా వైరస్​ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై మరో మూడు రోజుల్లో విస్తృత మర్గదర్శకాలను రూపొందించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఈ అంశంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీల నుంచి సూచనలు తీసుకున్నట్టు పేర్కొంది.

COVID-19: EC  to frame guidelines for polls within three days
'ఎన్నికల నిర్వహణపై మూడు రోజుల్లో మార్గదర్శకాలు'

కరోనా సంక్షోభంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది.

వివిధ రాజకీయ పార్టీలు అందించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సలహాలను కూడా తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

తాము వెలువరిచే మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని.. స్థానికంగా కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించే బాధ్యత ముఖ్య ఎన్నికల అధికారులదేనని స్పష్టం చేసింది ఈసీ.

ఈ ఏడాది అక్టోబర్​-డిసెంబర్​ తేదీల్లో బిహార్​ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనితో పాటు కరోనా సంక్షోభం, వరదల వల్ల అనేక ఉపఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కొత్త షెడ్యూళ్లను విడుదల చేయలేదు ఈసీ.

ఇదీ చూడండి:- సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

కరోనా సంక్షోభంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది.

వివిధ రాజకీయ పార్టీలు అందించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సలహాలను కూడా తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

తాము వెలువరిచే మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని.. స్థానికంగా కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించే బాధ్యత ముఖ్య ఎన్నికల అధికారులదేనని స్పష్టం చేసింది ఈసీ.

ఈ ఏడాది అక్టోబర్​-డిసెంబర్​ తేదీల్లో బిహార్​ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనితో పాటు కరోనా సంక్షోభం, వరదల వల్ల అనేక ఉపఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కొత్త షెడ్యూళ్లను విడుదల చేయలేదు ఈసీ.

ఇదీ చూడండి:- సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.