ETV Bharat / bharat

'కేంద్రమంత్రులు సోమవారం నుంచి కార్యాలయాలకు వెళ్లాలి'

author img

By

Published : Apr 11, 2020, 10:26 PM IST

కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ కార్యాలయాలకు హాజరు కావాలని పీఎంఓ సూచించినట్లు సమాచారం. మంత్రులు విధులకు హాజరై ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

Council of ministers to resume work from offices on Monday
మంత్రులందరూ సోమవారం నుంచి విధుల్లోకి చేరండి: కేంద్రం

కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ మంత్రిత్వశాఖల కార్యాలయాల్లో విధులను నిర్వర్తించాలని పీఎంఓ సూచించినట్లు తెలుస్తోంది. లాక్​డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రులకు నిర్దేశం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు ఇన్ని రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేసిన సంయుక్త కార్యదర్శులు, ఉన్నతస్థాయి అధికారులు మంత్రుల కార్యాలయాల్లో విధులకు హాజరు కానున్నట్లు ఆయా శాఖలకు ఉత్తర్వులు అందాయి. అవసరం మేరకు మూడో వంతు సిబ్బంది విధులకు వెళ్లాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ​హాట్​స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. లాక్​డౌన్​ ఎత్తివేత తర్వాత తీసుకునే చర్యలపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది

ఇదీ చదవండి: లాక్​డౌన్​ మరో 2 వారాలు పొడిగింపు?

కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ మంత్రిత్వశాఖల కార్యాలయాల్లో విధులను నిర్వర్తించాలని పీఎంఓ సూచించినట్లు తెలుస్తోంది. లాక్​డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రులకు నిర్దేశం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు ఇన్ని రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేసిన సంయుక్త కార్యదర్శులు, ఉన్నతస్థాయి అధికారులు మంత్రుల కార్యాలయాల్లో విధులకు హాజరు కానున్నట్లు ఆయా శాఖలకు ఉత్తర్వులు అందాయి. అవసరం మేరకు మూడో వంతు సిబ్బంది విధులకు వెళ్లాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ​హాట్​స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. లాక్​డౌన్​ ఎత్తివేత తర్వాత తీసుకునే చర్యలపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది

ఇదీ చదవండి: లాక్​డౌన్​ మరో 2 వారాలు పొడిగింపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.