ETV Bharat / bharat

'పొరపాటు జరిగింది... ఆయన మృతికి కరోనా కారణం కాదు' - కరోనా వైరస్​ వార్తలు

దేశవ్యాప్తంగా 562మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 41మంది కోలుకున్నారు. అయితే మృతుల సంఖ్యలో మార్పులు చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.

Coronavirus cases in India soar to 562
దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులు
author img

By

Published : Mar 25, 2020, 10:40 AM IST

దేశంలో కరోనా వైరస్​ మృతుల సంఖ్యను 10 నుంచి 9కి తగ్గించింది కేంద్ర ఆరోగ్యశాఖ. దిల్లీలో ఓ వ్యక్తి వైరస్​ కారణంగా మరణించాడని భావించినప్పటికీ.. పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్​గా నిర్ధరణ అయ్యింది.

ఇప్పటివరకు మహారాష్ట్రలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్​, కర్ణాటక, గుజరాత్​, దిల్లీ, పంజాబ్​, బంగాల్​, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్కరు చొప్పున మరణించారు.

పెరుగుతున్న కేసులు...

దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 562మందికి వైరస్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. వీరిలో 41మంది విదేశీయులున్నారు. మొత్తం 41మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

అత్యధికంగా కేరళలో 109 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 101, కర్ణాటకలో 41, ఉత్తరప్రదేశ్​లో 35, గుజరాత్​లో 33 మంది వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి:- కరోనాపై విజయం సాధిస్తే ఇక నిత్యం ఉగాదే!

దేశంలో కరోనా వైరస్​ మృతుల సంఖ్యను 10 నుంచి 9కి తగ్గించింది కేంద్ర ఆరోగ్యశాఖ. దిల్లీలో ఓ వ్యక్తి వైరస్​ కారణంగా మరణించాడని భావించినప్పటికీ.. పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్​గా నిర్ధరణ అయ్యింది.

ఇప్పటివరకు మహారాష్ట్రలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్​, కర్ణాటక, గుజరాత్​, దిల్లీ, పంజాబ్​, బంగాల్​, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్కరు చొప్పున మరణించారు.

పెరుగుతున్న కేసులు...

దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 562మందికి వైరస్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. వీరిలో 41మంది విదేశీయులున్నారు. మొత్తం 41మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

అత్యధికంగా కేరళలో 109 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 101, కర్ణాటకలో 41, ఉత్తరప్రదేశ్​లో 35, గుజరాత్​లో 33 మంది వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి:- కరోనాపై విజయం సాధిస్తే ఇక నిత్యం ఉగాదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.