ETV Bharat / bharat

దేశంలో కరోనా విజృంభణ-30వేలకు చేరువలో కేసులు

author img

By

Published : Apr 28, 2020, 6:29 PM IST

దేశంలో కరోనా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. 24 గంటల వ్యవధిలో 51మంది వైరస్​కు బలయ్యారు. 1594మందికి కొత్తగా వైరస్ సోకింది. వైరస్ ప్రభావం మహారాష్ట్రలో అధికంగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 8590 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 369కి చేరింది.

corona in india
దేశంలో కరోనా విజృంభణ

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1594మంది వైరస్ బారినపడ్డారు. 51 మంది ప్రాణాలు కోల్పోయారు.

india statistics
భారత్​లో కరోనా గణాంకాలు

మహారాష్ట్ర సచివాలయంలో..

మహారాష్ట్రలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్ర సచివాలయంలోని నలుగురికి కరోనా సోకింది. ఈ కారణంగా రెండురోజులపాటు సచివాలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. వైరస్ బారినపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 8590మందికి వైరస్ సోకింది. 369మంది వైరస్​ కారణంగా మృతి చెందారు.

ఒడిశాలో మరో ఏడుగురికి..

ఒడిశాలో మరో ఏడుగురికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 118కి చేరింది. రాష్ట్రంలో 37మందికి వైరస్ నయమవగా..యాక్టివ్ కేసుల సంఖ్య 80 గా ఉంది.

కశ్మీర్​లో వృద్ధురాలు మృతి..

జమ్ముకశ్మీర్​లో కరోనాతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. శ్రీనగర్​ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న వృద్ధురాలు ఆరోగ్యం విషమించి మృతి చెందింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిదిమంది వైరస్​కు బలయ్యారు. 546మందికి వైరస్ సోకింది.

సీఆర్​పీఎఫ్ జవాను..

దిల్లీలో వైరస్ కారణంగా సీఆర్​పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్​ఐ స్థాయి అధికారి అనారోగ్య కారణంగా సఫ్దార్​జంగ్ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేంద్ర బలగాల్లో వైరస్​తో నమోదయిన తొలి మృతి ఇదే. మరో 23మంది జవాన్లు వైరస్​తో ఆసుపత్రిలో చేరారు.

రాష్ట్రాలవారీగా..

కేసుల సంఖ్య గుజరాత్​లో 3548, దిల్లీలో 3108, మధ్యప్రదేశ్​లో 2368, రాజస్థాన్​లో 2262, తమిళనాడులో 1937, ఉత్తర్​ప్రదేశ్​లో 2043కు పెరిగింది. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా గుజరాత్​లో 162మంది, మధ్యప్రదేశ్​లో 113 మంది వైరస్​తో అసువులు బాశారు.

ఇదీ చూడండి: యూపీలో ఇద్దరు పూజారుల హత్య- యోగిపై విపక్షాల విమర్శలు

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1594మంది వైరస్ బారినపడ్డారు. 51 మంది ప్రాణాలు కోల్పోయారు.

india statistics
భారత్​లో కరోనా గణాంకాలు

మహారాష్ట్ర సచివాలయంలో..

మహారాష్ట్రలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్ర సచివాలయంలోని నలుగురికి కరోనా సోకింది. ఈ కారణంగా రెండురోజులపాటు సచివాలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. వైరస్ బారినపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 8590మందికి వైరస్ సోకింది. 369మంది వైరస్​ కారణంగా మృతి చెందారు.

ఒడిశాలో మరో ఏడుగురికి..

ఒడిశాలో మరో ఏడుగురికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 118కి చేరింది. రాష్ట్రంలో 37మందికి వైరస్ నయమవగా..యాక్టివ్ కేసుల సంఖ్య 80 గా ఉంది.

కశ్మీర్​లో వృద్ధురాలు మృతి..

జమ్ముకశ్మీర్​లో కరోనాతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. శ్రీనగర్​ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న వృద్ధురాలు ఆరోగ్యం విషమించి మృతి చెందింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిదిమంది వైరస్​కు బలయ్యారు. 546మందికి వైరస్ సోకింది.

సీఆర్​పీఎఫ్ జవాను..

దిల్లీలో వైరస్ కారణంగా సీఆర్​పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్​ఐ స్థాయి అధికారి అనారోగ్య కారణంగా సఫ్దార్​జంగ్ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేంద్ర బలగాల్లో వైరస్​తో నమోదయిన తొలి మృతి ఇదే. మరో 23మంది జవాన్లు వైరస్​తో ఆసుపత్రిలో చేరారు.

రాష్ట్రాలవారీగా..

కేసుల సంఖ్య గుజరాత్​లో 3548, దిల్లీలో 3108, మధ్యప్రదేశ్​లో 2368, రాజస్థాన్​లో 2262, తమిళనాడులో 1937, ఉత్తర్​ప్రదేశ్​లో 2043కు పెరిగింది. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా గుజరాత్​లో 162మంది, మధ్యప్రదేశ్​లో 113 మంది వైరస్​తో అసువులు బాశారు.

ఇదీ చూడండి: యూపీలో ఇద్దరు పూజారుల హత్య- యోగిపై విపక్షాల విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.