భారత్లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9983 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 206 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
మహారాష్ట్రలో అత్యధికంగా 3060 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 85 వేలు దాటింది. గుజరాత్లో 1249 మంది, మధ్యప్రదేశ్లో 412, బంగాల్లో 396 మంది మరణించారు.
