ETV Bharat / bharat

24 గంటల్లో 11,458 మందికి కరోనా- 386 మంది బలి

author img

By

Published : Jun 13, 2020, 9:10 AM IST

Updated : Jun 13, 2020, 10:08 AM IST

భారత్​లో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 8 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 11,458 కేసులు నమోదయ్యాయి. మరో 386 మంది కరోనాతో మృతి చెందారు.

Corona cases crossing three lakhs in India
భారత్​లో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల మార్కు దాటిపోయింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 11,458 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 386 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.

Corona cases crossing three lakhs in India
3 లక్షలు దాటిన కేసులు- 24 గంటల్లో 11,458 మందికి కరోనా

రాష్ట్రాల వారీగా..

కొత్తగా నమోదైన 386 కరోనా మరణాల్లో.. దిల్లీ- 129, మహారాష్ట్ర- 127, గుజరాత్​- 30, ఉత్తర్​ప్రదేశ్​- 20, తమిళనాడు- 18, బంగాల్​- 9, తెలంగాణ- 9, మధ్యప్రదేశ్​- 9, కర్ణాటక- 7, రాజస్థాన్​- 7, హరియాణా- 6, ఉత్తరాఖండ్​- 6, పంజాబ్​- 4, అసోం- 2; కేరళ, జమ్ము కశ్మీర్​, ఒడిశాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇప్పటి వరకు కరోనా వ్యాధి నుంచి 49.9 శాతం మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల మార్కు దాటిపోయింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 11,458 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 386 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.

Corona cases crossing three lakhs in India
3 లక్షలు దాటిన కేసులు- 24 గంటల్లో 11,458 మందికి కరోనా

రాష్ట్రాల వారీగా..

కొత్తగా నమోదైన 386 కరోనా మరణాల్లో.. దిల్లీ- 129, మహారాష్ట్ర- 127, గుజరాత్​- 30, ఉత్తర్​ప్రదేశ్​- 20, తమిళనాడు- 18, బంగాల్​- 9, తెలంగాణ- 9, మధ్యప్రదేశ్​- 9, కర్ణాటక- 7, రాజస్థాన్​- 7, హరియాణా- 6, ఉత్తరాఖండ్​- 6, పంజాబ్​- 4, అసోం- 2; కేరళ, జమ్ము కశ్మీర్​, ఒడిశాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇప్పటి వరకు కరోనా వ్యాధి నుంచి 49.9 శాతం మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

Last Updated : Jun 13, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.