ETV Bharat / bharat

'కార్మికుల రైలు టికెట్ ఖర్చులు మేం భరిస్తాం' - కార్మికులకు రైలు కాంగ్రెస్ రైలు టికెట్లు

కరోనా సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బంది పుడుతున్న వలస కార్మికుల టికెట్​ ఖర్చులను తాము భరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనీయా గాంధీ ప్రదేశ్ కమిటీలకు పిలుపునిచ్చారు.

congress will pay train fare of migrant workers
వలస కార్మీకుల రైలు టికెట్​ ఖర్చులు భరిస్తాం
author img

By

Published : May 4, 2020, 9:09 AM IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయి.. డబ్బులు లేక తమ స్వస్థలాలకు వెళ్లలేక పోతున్నవారికి చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది కాంగ్రెస్​. అవసరమైన వారికి రైలు టికెట్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కమిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.

ఇది కార్మికులకు గౌరవంతో చేస్తున్న సహకారమని ఆమె అన్నారు. కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వారని.. వారి త్యాగాలే జాతికి పునాదులని సోనియా కొనియాడారు.

ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను శ్రామిక్​ రైళ్ల ద్వారా స్వస్థలాలకు పంపిస్తోంది కేంద్రం. అయితే ఈ రవాణాకు కార్మికుల నుంచి టికెట్ వసూలు చేస్తోంది. ఇలాంటి సమయాల్లో డబ్బులు లేక ఇబ్బంది పడేవారికి చేయుతనిచ్చేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:'90శాతం నిండితేనే శ్రామిక్‌ రైళ్లు నడపాలి'

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయి.. డబ్బులు లేక తమ స్వస్థలాలకు వెళ్లలేక పోతున్నవారికి చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది కాంగ్రెస్​. అవసరమైన వారికి రైలు టికెట్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కమిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.

ఇది కార్మికులకు గౌరవంతో చేస్తున్న సహకారమని ఆమె అన్నారు. కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వారని.. వారి త్యాగాలే జాతికి పునాదులని సోనియా కొనియాడారు.

ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను శ్రామిక్​ రైళ్ల ద్వారా స్వస్థలాలకు పంపిస్తోంది కేంద్రం. అయితే ఈ రవాణాకు కార్మికుల నుంచి టికెట్ వసూలు చేస్తోంది. ఇలాంటి సమయాల్లో డబ్బులు లేక ఇబ్బంది పడేవారికి చేయుతనిచ్చేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:'90శాతం నిండితేనే శ్రామిక్‌ రైళ్లు నడపాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.