కాంగ్రెస్ పార్టీ మరో విస్తృత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేంద్రానికి.. పేదలు, వలసదారులు సహా చిన్న, మధ్య తరగతి ప్రజల గళాన్ని వినిపించడానికి 'స్పీక్అప్' ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సహా సానుభూతిపరులు గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని సాగిస్తారని కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకెన్ తెలిపారు.
వలసదారులందరూ క్షేమంగా ఇంటికి చేరేలా చూడాలని కేంద్రాన్ని కోరనున్నట్లు అజయ్ వెల్లడించారు. వారికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తూ.. వేతనాన్ని రూ.200కు పెంచాలని సూచించారు. అంతేకాకుండా వారికి రూ.10వేల తక్షణ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: గుర్రానికీ తప్పని క్వారంటైన్