ETV Bharat / bharat

కాంగ్రెస్​ కవర్​ డ్రైవ్​.. కేరళ నుంచి రాహుల్

author img

By

Published : Mar 31, 2019, 12:03 PM IST

Updated : Mar 31, 2019, 2:12 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పోటీ చేయనున్న రెండో లోక్​సభ స్థానంపై స్పష్టత వచ్చేసింది. దక్షిణాది రాష్ట్రం కేరళలోని వయనాడ్​ నుంచి రాహుల్ పోటీ చేయనున్నారని సీనియర్ నేత ఏకే ఆంటోనీ తెలిపారు.

కేరళ వయనాడ్​ నుంచి రాహుల్​ పోటీ

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పోటీచేయనున్న రెండో లోక్​సభ నియోజకవర్గంపై ఊహాగానాలకు తెరపడింది. హస్తం పార్టీ కంచుకోట అయిన కేరళలోని వయనాడ్​ నుంచి రాహుల్ బరిలో దిగుతారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రకటించారు. ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్​ అమేఠీ నుంచీ రాహుల్ బరిలో ఉండనున్నారు.

కర్ణాటక నుంచి పోటీ చేయాలని రాహుల్​ గాంధీని మాజీ సీఎం సిద్ధరామయ్య కొద్దిరోజుల కిందటే కోరారు. తమిళనాడు, కేరళ నేతలు కూడా తమ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తారని ఆశించారు. ఉన్నత స్థాయి నాయకుడు పోటీ చేస్తే పార్టీ బలోపేతం అవుతుందన్నదని వారి భావన. కానీ, రాహుల్​ రెండో స్థానం గురించి కాంగ్రెస్​ పార్టీ చాలా రోజుల నుంచి ఉత్కంఠను కొనసాగించింది.

కేరళ వయనాడ్​ నుంచి రాహుల్​ పోటీ

వయనాడ్​ను ఎంపికచేయటానికి చాలా అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కోరుతున్న దృష్ట్యా మిగతా స్థానాల కంటే వయనాడే సరైన స్థానమని నిర్ణయించాం. ఎందుకంటే వయనాడ్​ కేరళలో ఉన్నప్పటికీ త్రిముఖ కూడలిగా ఉంది. ఒకవైపు తమిళనాడు సరిహద్దుకు అతిదగ్గర నీలగిరి నియోజకవర్గం తదితర ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటకలో సమీప నియోజకవర్గం చామరాజ​నగర్​ అయినప్పటికీ మొత్తం మైసూర్​ ప్రాంతం దీనికి దగ్గరలోనే ఉంటుంది. కేరళలో ఉన్నప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ నియోజకవర్గం చుట్టూ ఉంటాయి. కాబట్టే ఈ స్థానాన్ని ఎంచుకున్నాం. - ఏకే ఆంటోనీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

అమేఠీలో రాహుల్​గాంధీ ఓడిపోయే అవకాశం ఉందని, అందుకే దక్షిణాది నుంచి పోటీచేయాలనుకుంటున్నారని భాజపా విమర్శిస్తోంది. దీనిని ఖండించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. మోదీ కూడా గుజరాత్​లోని వడోదరతో పాటు వారణాసి నుంచి పోటీచేశారని గుర్తు చేశారు. వడోదరలో గెలుపుపై నమ్మకం లేదా? అని చురకలంటిచారు.

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పోటీచేయనున్న రెండో లోక్​సభ నియోజకవర్గంపై ఊహాగానాలకు తెరపడింది. హస్తం పార్టీ కంచుకోట అయిన కేరళలోని వయనాడ్​ నుంచి రాహుల్ బరిలో దిగుతారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రకటించారు. ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్​ అమేఠీ నుంచీ రాహుల్ బరిలో ఉండనున్నారు.

కర్ణాటక నుంచి పోటీ చేయాలని రాహుల్​ గాంధీని మాజీ సీఎం సిద్ధరామయ్య కొద్దిరోజుల కిందటే కోరారు. తమిళనాడు, కేరళ నేతలు కూడా తమ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తారని ఆశించారు. ఉన్నత స్థాయి నాయకుడు పోటీ చేస్తే పార్టీ బలోపేతం అవుతుందన్నదని వారి భావన. కానీ, రాహుల్​ రెండో స్థానం గురించి కాంగ్రెస్​ పార్టీ చాలా రోజుల నుంచి ఉత్కంఠను కొనసాగించింది.

కేరళ వయనాడ్​ నుంచి రాహుల్​ పోటీ

వయనాడ్​ను ఎంపికచేయటానికి చాలా అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కోరుతున్న దృష్ట్యా మిగతా స్థానాల కంటే వయనాడే సరైన స్థానమని నిర్ణయించాం. ఎందుకంటే వయనాడ్​ కేరళలో ఉన్నప్పటికీ త్రిముఖ కూడలిగా ఉంది. ఒకవైపు తమిళనాడు సరిహద్దుకు అతిదగ్గర నీలగిరి నియోజకవర్గం తదితర ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటకలో సమీప నియోజకవర్గం చామరాజ​నగర్​ అయినప్పటికీ మొత్తం మైసూర్​ ప్రాంతం దీనికి దగ్గరలోనే ఉంటుంది. కేరళలో ఉన్నప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ నియోజకవర్గం చుట్టూ ఉంటాయి. కాబట్టే ఈ స్థానాన్ని ఎంచుకున్నాం. - ఏకే ఆంటోనీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

అమేఠీలో రాహుల్​గాంధీ ఓడిపోయే అవకాశం ఉందని, అందుకే దక్షిణాది నుంచి పోటీచేయాలనుకుంటున్నారని భాజపా విమర్శిస్తోంది. దీనిని ఖండించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. మోదీ కూడా గుజరాత్​లోని వడోదరతో పాటు వారణాసి నుంచి పోటీచేశారని గుర్తు చేశారు. వడోదరలో గెలుపుపై నమ్మకం లేదా? అని చురకలంటిచారు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 31, 2019, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.