ETV Bharat / bharat

రాజ్యసభ లోపలే విపక్షాల ధర్నా- మండిపడ్డ నడ్డా - The irresponsible act of opposition is unfortunate

వ్యవసాయ బిల్లులకు ఆమోదం అనంతరం.. రాజ్యసభ లోపలే నిరసనకు దిగాయి విపక్షాలు. బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్​ చేశాయి. విపక్షాల చర్యను తీవ్రంగా తప్పుబట్టారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. వారు రైతు వ్యతిరేకులు అని విమర్శించారు.

Congress other opposition parties sit in protest inside Rajya Sabha after farm bills passed amid din and House adjourned
రాజ్యసభ లోపలే విపక్షాల ధర్నా- మండిపడ్డ నడ్డా
author img

By

Published : Sep 20, 2020, 3:06 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్షాలు. బిల్లుల ఆమోదం అనంతరం సభ వాయిదా పడినా కాంగ్రెస్​ సహా ఇతర విపక్ష సభ్యులు ఎగువసభ లోపలే నిరసనకు దిగారు. బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

విపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుల ఆమోదం సమయంలో.. విపక్షాలు అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించాయని అన్నారు. దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. విపక్షాలు రైతు వ్యతిరేకులు అని, ఈ చర్యను భాజపా తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

''విపక్షాల బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన దురదృష్టకరం. వారు ప్రోటోకాల్స్​ను ఉల్లంఘించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని.. ఛైర్మన్​ తగిన చర్యలు తీసుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా సాగాలి. దానిని దుర్వినియోగపరచకుండా చూడాలని ఛైర్మన్​ను కోరుతున్నాం.''

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్షాలు. బిల్లుల ఆమోదం అనంతరం సభ వాయిదా పడినా కాంగ్రెస్​ సహా ఇతర విపక్ష సభ్యులు ఎగువసభ లోపలే నిరసనకు దిగారు. బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

విపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుల ఆమోదం సమయంలో.. విపక్షాలు అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించాయని అన్నారు. దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. విపక్షాలు రైతు వ్యతిరేకులు అని, ఈ చర్యను భాజపా తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

''విపక్షాల బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన దురదృష్టకరం. వారు ప్రోటోకాల్స్​ను ఉల్లంఘించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని.. ఛైర్మన్​ తగిన చర్యలు తీసుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా సాగాలి. దానిని దుర్వినియోగపరచకుండా చూడాలని ఛైర్మన్​ను కోరుతున్నాం.''

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.