ETV Bharat / bharat

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల జాబితాలో సీనియర్లకు ఉద్వాసన

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల జాబితా నుంచి సీనియర్ నేతలను తొలగించింది కాంగ్రెస్. సీడబ్ల్యూసీని పునర్​వ్వవస్థీకరించి ​.. ప్రధాన కార్యదర్శుల హోదా నుంచి గులాంనబీ ఆజాద్, మోతీలాల్​ వోరా, ఖర్గే వంటి సీనియర్లకు ఉద్వాసన పలికింది.

author img

By

Published : Sep 11, 2020, 10:01 PM IST

Updated : Sep 11, 2020, 10:39 PM IST

Congress appoints general secretaries and in-charges of All India Congress Committee
కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ పునర్​వ్యవస్థీకరణ

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)లో కీలక మార్పులు చేశారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. అనూహ్యంగా ప్రధాన కార్యదర్శుల జాబితా నుంచి కొంత మంది సీనియర్ నేతలను తొలగించారు. వీరిలో గులాం నబీ ఆజాద్, అంబికా సోని, మోతీ లాల్ వోరా, లుజెనియో ఫలేరియో, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో తనకు సహాయకంగా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఏకే అంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్​, ముకుల్ వాస్నిక్, రణ్​దీప్​ సుర్జేవాలా ఉన్నారు.

కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ, దాని కేంద్ర ఎన్నికల విభాగాన్ని కూడా పునర్​వ్యవస్థీకరించింది హస్తం పార్టీ. పి.చిదంబరం, రణ్​దీప్​ సుర్జేవాలా, తారీఖ్ అన్వర్, జితేంద్ర సింగ్ వంటి నేతలను సాధారణ సభ్యులుగా నియమించింది.

సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్​ నేతల బృందంలో.. ఆజాద్​, శర్మను సాధారణ సభ్యులుగా కొనసాగుతున్నారు. జితిన్​ ప్రసాదను శాశ్వత సభ్యులుగా నియమించారు.
కర్ణాటక ఇన్​ఛార్జిగా సుర్జేవాలా, బంగాల్​కు జితిన్​ ప్రసాదను నియమించారు సోనియా.

Congress appoints general secretaries and in-charges of All India Congress Committee
సీడబ్ల్యూసీ తాాజా జాబితా ఇదే..

ఇదీ చదవండి: రూ.16 వేల కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న మోదీ

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)లో కీలక మార్పులు చేశారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. అనూహ్యంగా ప్రధాన కార్యదర్శుల జాబితా నుంచి కొంత మంది సీనియర్ నేతలను తొలగించారు. వీరిలో గులాం నబీ ఆజాద్, అంబికా సోని, మోతీ లాల్ వోరా, లుజెనియో ఫలేరియో, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో తనకు సహాయకంగా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఏకే అంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్​, ముకుల్ వాస్నిక్, రణ్​దీప్​ సుర్జేవాలా ఉన్నారు.

కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ, దాని కేంద్ర ఎన్నికల విభాగాన్ని కూడా పునర్​వ్యవస్థీకరించింది హస్తం పార్టీ. పి.చిదంబరం, రణ్​దీప్​ సుర్జేవాలా, తారీఖ్ అన్వర్, జితేంద్ర సింగ్ వంటి నేతలను సాధారణ సభ్యులుగా నియమించింది.

సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్​ నేతల బృందంలో.. ఆజాద్​, శర్మను సాధారణ సభ్యులుగా కొనసాగుతున్నారు. జితిన్​ ప్రసాదను శాశ్వత సభ్యులుగా నియమించారు.
కర్ణాటక ఇన్​ఛార్జిగా సుర్జేవాలా, బంగాల్​కు జితిన్​ ప్రసాదను నియమించారు సోనియా.

Congress appoints general secretaries and in-charges of All India Congress Committee
సీడబ్ల్యూసీ తాాజా జాబితా ఇదే..

ఇదీ చదవండి: రూ.16 వేల కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న మోదీ

Last Updated : Sep 11, 2020, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.