ETV Bharat / bharat

'కేంద్రం ప్రకటనతో గల్వాన్​ వీరులకు అవమానం'

author img

By

Published : Sep 16, 2020, 6:00 PM IST

సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్రం తప్పుడు సమాచారం అందిస్తోందని మండిపడింది కాంగ్రెస్​. గత ఆరు నెలలుగా భారత్​-చైనా సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు జరగలేదన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఒక్క ప్రకటనతో గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో అమరవీరులైన జవాన్లను కేంద్రం అవమానించిందని ఆరోపించింది.

Cong attacks govt over minister's statement that no infiltration took place along Sino-India border in last 6 months
'గల్వాన్​ అమరవీరులను కేంద్రం అవమానించింది'

భారత్​-చైనా సరిహద్దులో గత ఆరు నెలల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదన్న కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో మండిపడింది. జూన్​ 15న గల్వాన్​ లోయ హింసాత్మక ఘటనలో వీరమరణం పొందిన జవాన్లను.. తన ప్రకటనతో కేంద్రం అవమానించిందని ఆరోపించింది.

ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ప్రస్తావించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం.. భారత్​ జవాన్లకు మద్దతిస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టతనివ్వాలని కోరారు.

  • Understand the chronology:

    🔹PM said- no one crossed the border
    🔹Then, took a huge loan from a China-based bank
    🔹Then, Def Min said- China occupied our land
    🔹Now, MOS Home says- there’s no infiltration.

    Is Modi Govt with Indian Army or with China?

    Modi ji, why so scared?

    — Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జరిగిన పరిణామాలను అర్థం చేసుకుందాం. ఎవరూ సరిహద్దును దాటలేదని ప్రధాని మోదీ ప్రకటించారు. అది చెప్పి.. చైనాలోని ఓ బడా బ్యాంకు నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత.. రక్షణమంత్రి వచ్చి.. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రకటించారు. ఇప్పుడేమో.. అసలు చొరబాట్లే జరగలేదని కేంద్ర హోంశాఖ అంటోంది. అసలు మోదీ ప్రభుత్వం ఎవరివైపు ఉంది? భారత జవాన్లవైపు ఉందా లేక చైనా వైపు ఉందా? మోదీజీ మీరు ఎందుకింత భయపడుతున్నారు."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

చొరబాట్లు జరగలేదంటూ ప్రకటించి.. చైనాకు ప్రభుత్వం క్లీన్​ చిట్​ ఇచ్చిందని.. మరో కాంగ్రెస్​ నేత పవన్​ ఖేడా ఆరోపించారు. ఈ విషయంలో ముందు మోదీ ప్రభుత్వం క్లీన్​ చిట్​ సంపాదించాలని వ్యాఖ్యానించారు.

ఇదీ జరిగింది...

చైనా సరిహద్దులో గత ఆరు నెలలుగా ఎలాంటి చొరబాట్లు జరగలేదని రాజ్యసభ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ వెల్లడించారు. అయితే ఇదే సమయంలో పాకిస్థాన్​వైపు నుంచి 47 చొరబాటు ఘటనలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:-

భారత్​-చైనా సరిహద్దులో గత ఆరు నెలల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదన్న కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో మండిపడింది. జూన్​ 15న గల్వాన్​ లోయ హింసాత్మక ఘటనలో వీరమరణం పొందిన జవాన్లను.. తన ప్రకటనతో కేంద్రం అవమానించిందని ఆరోపించింది.

ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ప్రస్తావించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం.. భారత్​ జవాన్లకు మద్దతిస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టతనివ్వాలని కోరారు.

  • Understand the chronology:

    🔹PM said- no one crossed the border
    🔹Then, took a huge loan from a China-based bank
    🔹Then, Def Min said- China occupied our land
    🔹Now, MOS Home says- there’s no infiltration.

    Is Modi Govt with Indian Army or with China?

    Modi ji, why so scared?

    — Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జరిగిన పరిణామాలను అర్థం చేసుకుందాం. ఎవరూ సరిహద్దును దాటలేదని ప్రధాని మోదీ ప్రకటించారు. అది చెప్పి.. చైనాలోని ఓ బడా బ్యాంకు నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత.. రక్షణమంత్రి వచ్చి.. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రకటించారు. ఇప్పుడేమో.. అసలు చొరబాట్లే జరగలేదని కేంద్ర హోంశాఖ అంటోంది. అసలు మోదీ ప్రభుత్వం ఎవరివైపు ఉంది? భారత జవాన్లవైపు ఉందా లేక చైనా వైపు ఉందా? మోదీజీ మీరు ఎందుకింత భయపడుతున్నారు."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

చొరబాట్లు జరగలేదంటూ ప్రకటించి.. చైనాకు ప్రభుత్వం క్లీన్​ చిట్​ ఇచ్చిందని.. మరో కాంగ్రెస్​ నేత పవన్​ ఖేడా ఆరోపించారు. ఈ విషయంలో ముందు మోదీ ప్రభుత్వం క్లీన్​ చిట్​ సంపాదించాలని వ్యాఖ్యానించారు.

ఇదీ జరిగింది...

చైనా సరిహద్దులో గత ఆరు నెలలుగా ఎలాంటి చొరబాట్లు జరగలేదని రాజ్యసభ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ వెల్లడించారు. అయితే ఇదే సమయంలో పాకిస్థాన్​వైపు నుంచి 47 చొరబాటు ఘటనలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.